తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు బనకచర్ల పొలిటికల్ హాట్ టాపిక్. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఒకే తాను ముక్కలుగా అభివర్ణిస్తూ.. ఇద్దర్నీ ఏక కాలంలో టార్గెట్ చేస్తోంది తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్.
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. కార్పొరేషన్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్ష పదవుల రేసులో నిలిచినా.. వీళ్ళకు ఆ ఒక్కటి అడ్డొస్తోందట. ఎక్కడికెళ్లినా ఆ తప్పునే గుర్తు చేస్తూ.. ఇద్దరికీ పదవులు రాకుండా అడ్డుపడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ నాయకులు.
మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ విప్గా పనిచేసిన అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రి అయ్యారు. రాంచంద్రు నాయక్ని డిప్యూటీ స్పీకర్ని చేస్తామని ప్రకటించేశారు పార్టీ పెద్దలు. ఈ క్రమంలో... ప్రభుత్వ విప్ల నియామకంపై ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విప్ పదవుల భర్తీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టిన క్రమంలో.. పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఎపిసోడ్తో లోకల్ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కొండా సురేఖ, మురళి దంపతులకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏకమై ప్రత్యేక సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చిన మర్నాడే... కొండా కుమార్తె సుస్మితా పటేల్ వ్యక్తిగత ఇన్స్టాలో పరకాల ఎమ్మెల్యే ఆస్పరెంట్ అంటూ పెట్టిన పోస్ట్ కాకరేపుతోంది. అసలు కొండా మురళి దంపతులకు, జిల్లా కాంగ్రెస్ నేతలకు మధ్య గ్యాప్నకు కారణమే…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో జల వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్ ఎపిసోడ్ని సీరియ్గా తీసుకోవాలని భావించింది బీఆర్ఎస్. దానికి సంబంధించి ఆ పార్టీ నేత హరీష్రావు వరుస మీడియా సమావేశాలు పెట్టి... తెలంగాణ, ఆంధ్ర నీటి పంపకాల అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ మధ్య దోస్తానా .. అంటూ వాళ్ళిద్దరికీ ముడిపెట్టి రాజకీయ అంశంగా మలచాలని భావించిందట గులాబీ పార్టీ.
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ ఓ రేంజ్లో నడుస్తోంది. ఇది ఎక్కడో మొదలైంది గానీ.. చివరికి ఎట్నుంటి ఎటు వెళ్తోందన్నది మాత్రం అంతుచిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అయితే.. వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధుల యుద్ధం హస్తిన దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు.. జిల్లా ఎమ్మెల్యేలు. ఈ ఆధిపత్య పోరు చాలా పెద్ద రచ్చకే దారితీస్తోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి మోగిపోతోంది. సిట్ దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్న క్రమంలో కవిత ఫోన్ ట్యాప్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అదే పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్ చేశారా? అన్న చర్చ మొదలైంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. బీఆర్ఎస్ క్యాడర్ పరిస్థితి వెన్న తిన్నవాడు వెళ్లిపోతే.. చల్ల తాగిన వాడిని చావ మోదినట్లు తయారైందట. ఒక వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్ధల ఎన్నికల కోసం.. వరుసగా గ్రామ, మండల, నియోజకవర్గ స్దాయి సమీక్షా సమావేశాలు పెట్టుకుంటుంటే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో మాత్రం ఆ సౌండే లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అంత మొనగాళ్ళు లేరని మీసాలు తిప్పిన మాజీలంతా.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారట.
రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు వివాదాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఒక్కోసారి... అవే పాపులర్ చేస్తాయి. ఇంకోసారి ఎత్తి అగాధంలోకి పడేస్తాయి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఈ రెండూ జరిగిపోయాయి. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్గా కెరీర్ ప్రారంభించిన మాధవ్.... 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలోకి ఎంటర్ అవుతూనే... ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడం చకచకగా జరిగిపోయాయి.
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ తేడాగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అయిన సందర్భాలు సైతం ఉన్నాయి.