కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు లోక్సభ ముందస్తు ఎన్నికలకు నాంది కావచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ముంబైలో రెండు రోజుల ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న తర్వాత పాట్నా విమానాశ్రయంలో దిగిన నితీష్ కుమార్.. సెప్టెంబర్ 18 మరియు 22 మధ్య ప్రభుత్వం పిలిచిన ప్రత్యేక సమావేశాలపై స్పందించారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అధికారంలోకి రాకముందు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటామని బీజేపీ నేత హామీ ఇచ్చారని, కానీ అది ఏనాడూ జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీపై లాలూ యాదవ్ మండిపడ్డారు.
ప్రతిపక్షాలు ఏకమైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
ముంబయిలో మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని కూటమి తీర్మానాన్ని ఆమోదించింది.
రాబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో అన్నారు.
Sonia Gandhi: లోక్సభ ఎన్నికలకు ముందు బెంగళూరులో బీజేపీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ విపక్షాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి 26 పార్టీల నేతలు చేరుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ కూడా సోమవారం బెంగళూరు చేరుకున్నారు.
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
Opposition Meeting: గత నెలలో పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల భేటీ జరిగింది. ముందుగా సిమ్లా వేదిక రెండోసారి ప్రతిపక్షాలు భేటీ కావాలని అనుకున్నాయి. అయితే ఈ వేదికను బెంగళూర్ కి మార్చారు. ఈ నెల 17-18 తేదీల్లో బెంగళూర్ వేదికగా రెండోసారి విపక్షాల భేటీ జరగబోతోంది.
Opposition Meeting: విపక్షాల ఐక్యతపై ఈ నెల 23న పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మొత్తం 17 పార్టీలు సమావేశమయ్యాయి.
PM Modi: 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.