Congress And AAP: ఢిల్లీ ఆర్డినెన్స్ కు కాంగ్రెస్ వ్యతిరేకం.. రేపటి ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొననున్న ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress And AAP: ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో సోమవారం బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి ముందే కాంగ్రెస్, ఆప్ ల మధ్య ఉన్న ఆగాధాన్ని పూడ్చుకున్నట్టు అయింది. ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, బెంగళూరులో కీలక ప్రతిపక్ష సమావేశానికి ముందు సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎట్టకేలకు నిర్ణయించింది. కీలకమైన 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీతో పొత్తు పెట్టుకునే లక్ష్యంతో రేపు జరగనున్న కీలక ప్రతిపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఇది పెద్ద మద్దతుగా మారింది.
Read also: Venugopala Krishna: అక్కడ వైసీపీలో అసమ్మతి లేదు.. మంత్రి వేణుగోపాల్ క్లారిటీ
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఢిల్లీలో సర్వీసుల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు తాము మద్దతు ఇవ్వబోమని, దేశంలో ఫెడరలిజాన్ని విధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆప్పై మండిపడ్డారు. పాట్నా సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్స్ అంశాన్ని ఆప్ తీసుకున్న తీరు దురదృష్టకరమని అన్నారు. త స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని.. ఆప్ నేతలు రేపటి సమావేశంలో పాల్గొనబోతున్నారని భావిస్తున్నానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. ఆర్డినెన్స్పై మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. మేము దానికి మద్దతు ఇవ్వబోమని తెలిపారు. ఫెడరలిజానికి విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను మేము నిరంతరం వ్యతిరేకిస్తున్నామని.. ప్రతిపక్ష రాష్ట్రాలను గవర్నర్ల ద్వారా నడిపించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని తాము నిరంతరం వ్యతిరేకిస్తున్నామని, అందులో తమ స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది వేణుగోపాల్ స్పష్టం చేశారు.
Read also: Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదు
ఆర్డినెన్స్పై కాంగ్రెస్ నిర్థిష్టంగా తమ వ్యతిరేకతను తెలియజేయడంతో ఈ నిర్ణయాన్ని ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా స్వాగతించారు. ఇది సానుకూల పరిణామని అన్నారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఇప్పుడు బహిరంగంగా మరియు అధికారికంగా ప్రకటన చేసినందున, బెంగళూరులో జరిగే సమావేశంలో భాగం కావాలని పీఏసీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్త పర్యటనకు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్, భారత్ రాష్ట్రీయ సమితి (BRS), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) మరియు ఇతరులు ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాటంలో AAPకి తమ మద్దతును అందించారు. జూన్ 23న పాట్నాలో జరిగిన తొలి విపక్ష సమావేశం తర్వాత ఆప్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?