Congress And AAP: ఢిల్లీ ఆర్డినెన్స్ కు కాంగ్రెస్ వ్యతిరేకం.. రేపటి ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొననున్న ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress And AAP: ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో సోమవారం బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి ముందే కాంగ్రెస్, ఆప్ ల మధ్య ఉన్న ఆగాధాన్ని పూడ్చుకున్నట్టు అయింది. ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, బెంగళూరులో కీలక ప్రతిపక్ష సమావేశానికి ముందు సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎట్టకేలకు నిర్ణయించింది. కీలకమైన 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీతో పొత్తు పెట్టుకునే లక్ష్యంతో రేపు జరగనున్న కీలక ప్రతిపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఇది పెద్ద మద్దతుగా మారింది.
Read also: Venugopala Krishna: అక్కడ వైసీపీలో అసమ్మతి లేదు.. మంత్రి వేణుగోపాల్ క్లారిటీ
Also Read
ఢిల్లీలో సర్వీసుల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు తాము మద్దతు ఇవ్వబోమని, దేశంలో ఫెడరలిజాన్ని విధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆప్పై మండిపడ్డారు. పాట్నా సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్స్ అంశాన్ని ఆప్ తీసుకున్న తీరు దురదృష్టకరమని అన్నారు. త స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని.. ఆప్ నేతలు రేపటి సమావేశంలో పాల్గొనబోతున్నారని భావిస్తున్నానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. ఆర్డినెన్స్పై మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. మేము దానికి మద్దతు ఇవ్వబోమని తెలిపారు. ఫెడరలిజానికి విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను మేము నిరంతరం వ్యతిరేకిస్తున్నామని.. ప్రతిపక్ష రాష్ట్రాలను గవర్నర్ల ద్వారా నడిపించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని తాము నిరంతరం వ్యతిరేకిస్తున్నామని, అందులో తమ స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది వేణుగోపాల్ స్పష్టం చేశారు.
Read also: Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదు
ఆర్డినెన్స్పై కాంగ్రెస్ నిర్థిష్టంగా తమ వ్యతిరేకతను తెలియజేయడంతో ఈ నిర్ణయాన్ని ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా స్వాగతించారు. ఇది సానుకూల పరిణామని అన్నారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఇప్పుడు బహిరంగంగా మరియు అధికారికంగా ప్రకటన చేసినందున, బెంగళూరులో జరిగే సమావేశంలో భాగం కావాలని పీఏసీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్త పర్యటనకు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్, భారత్ రాష్ట్రీయ సమితి (BRS), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) మరియు ఇతరులు ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాటంలో AAPకి తమ మద్దతును అందించారు. జూన్ 23న పాట్నాలో జరిగిన తొలి విపక్ష సమావేశం తర్వాత ఆప్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?