ముంబైలో కరోనా నిబంధనలను మరింత కఠినం చేశారు. రోజు రోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ముంబై బీజ్లో అనుమతులను నిరాకరించారు. Read: తెలంగాణలో రికార్డ్…
కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, కరోనాను ఐదు రోజుల్లోనే కట్టడి చేయగట సామర్థ్యం ఉందని చెబుతున్న మోల్నుపిరావిల్ ఇండియా యాంటీ వైరల్ డ్రగ్ కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఇండియాలో ఈ మాత్రలు తయారు చేయడానికి 13 కంపెనీలు అనుమతి తీసుకోగా…
తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. కరోనా, ఒమిక్రాన్ కేసులపై విచారణ జరిపింది హైకోర్టు.. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్స్.. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని కోరారు.. ఇంత వరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. Read…
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని, వచ్చే రెండు నుంచి నాలుగు వారాల దేశానికే కాదు రాష్ట్రానికీ ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని…
కరోనా వీరవిహారం చేస్తోంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కరోనా బాధితులకు శాపం కానుంది. సిద్దిపేట పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మూడవ వార్డులో యువజన సంఘల సభ్యులు వ్యాక్సిన్ వేసుకోని వారి ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించడం కనిపించింది. వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దంటున్నారు అధికారులు. తెలంగాణలో కరోనా మొదటి డోస్ సుమారుగా వంద శాతం పూర్తయింది. రెండో డోస్ వేయించుకోవడానికి జనం సిద్ధం అవుతున్నారు. కొంతమంది యువత వ్యాక్సిన్ పట్ల…
దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఢిల్లీ, మహారాష్ట్రపై అధికంగా ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసుల వృద్ధి 86శాతంగా ఉంటే, మహారాష్ట్రలో 82శాతంగా ఉంది. ఇక, మహారాష్ట్రలో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం 252 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 945 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. Read: నిబంధనలు పాటించకుంటే……
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న వేళ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే మహమ్మారికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని అన్నారు. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జనవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్నవారికి వ్యాక్సిన్ అందిస్తున్నందువలన అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. Read: నయా రికార్డ్:…
ఢిల్లీలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో 923 కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిన్నటి రోజున నమోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో సినిమా హాళ్లు, స్కూళ్లను మూసివేశారు. 50 శాతం సీటింగ్లో హోటళ్లు, మెట్రోలు, బార్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని,…
అమెరికాలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి 8 వ తేదీన 2.94 లక్షల కేసులు నమదవ్వగా దాదాపు దానికి రెండింతల కేసులు యూఎస్లో ఈ ఒక్కరోజులో నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. జాన్ హోప్కిన్స్ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 5.12 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి మొదలయ్యాక ఈ స్థాయిలో…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. ఆరు నెలల కాలం నుంచి కనిష్టంగా నమోదవుతున్న కేసుల్లో అనూహ్యంగా వేగం పుంజుకుంది. వారం రోజుల నుంచి క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల అలజడితో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండగా, అదే బాటలో ఇప్పుడు చెన్నై కూడా పయనిస్తున్నది. గత రెండు మూడు రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ…