Home
Omicron
Omicron News
-
భారత్పై కరోనా పంజా.. ఒకే రోజు 1.59 లక్షలకు పైగా కేసులు
భారత్లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం భారత్పై ఏ స్థాయిలో ఉందో.. వరుసగా వెలుగు చూస్తున్న కొత్త కేసులే చెబుతున్నాయి.. గత ఐదు రోజులుగా ప్రతీ రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తూ.. కరోనా మీటర్ పరుగులు పెడుతోంది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 327 మంది కోవిడ్… -
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 2606..
కరోనా మహమ్మారి విజృంభన రోజురోజుకు క్రమంగా పెరుగూ వస్తోంది. ఇప్పటికే దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో 73,156 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,606 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇద్దరు కరోనా బారినపడి మరణించారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 285 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో… -
షార్లో కరోనా టెర్రర్.. 12మందికి పాజిటివ్
కరోనా తన ప్రతాపం చూపుతోంది. మళ్ళీ ఎవరినీ వదలడం లేదు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ లో కరోనా థర్డ్ వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్ కు పంపారు. శ్రీహరి కోటలోని షార్ లో కరోనా మూడో వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి… -
బెంగళూరులో 10శాతం దాటిన పాజిటివిటీ రేటు…రికార్డ్ స్థాయిలో కేసులు…
కర్ణాటకలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. గత నాలుగురోజులుగా బెంగళూరులో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 8,906 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 7,113 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో పాజిటివిటీ రేటు 10శాతంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. Read: కుమారుడికి కరోనా పాజిటివ్… -
ఐఐటీ మద్రాస్ కీలక సర్వే: ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్…
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్ మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో వీకెంట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రోజువారీ కేసులు గత మూడు రోజులుగా లక్షకు పైగా నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇకపోతే, దేశంలో మూడో వేవ్ ఎప్పటి వరకు పీక్స్ కు వెళ్తుంది అనే… -
టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
ఓవైపు కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పటికే భారత్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇప్పటికే 27 రాష్ట్రాలకు పాకింది.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 3 వేలను దాటేశాయి.. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు… -
ఖత్తర్ నుంచి కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్..
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. అయితే కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలం తలమడ్ల గ్రామానికి ఇటీవల ఖత్తర్ నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తికి 5 రోజుల క్రితం కరోనా పాజిటివ్ తేలడంతో జీనోమ్ పరీక్షకు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణైంది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో అందరూ… -
బీ అలర్ట్ : రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి ఒమిక్రాన్!
ఒకప్పుడు కరోనా వైరస్.. తర్వాత డెల్టా… ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్. చిన్నవైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ ప్రభావం.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని WHO ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత తక్కువగానే ఉంది.… -
మహారాష్ట్రలో కొత్తగా 20,971 కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్లోకి ప్రవేశించింది. అయితే దీంతో ఈ వేరియంట్ పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 20,971 కొత్త కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. అయితే మహారాష్ట్రలో 20 వేల కేసులు దాటితే లాక్డౌన్ విధిస్తామని మహా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే కొత్తగా నమోదైన కేసులు సంఖ్య ప్రకారం మహాలో… -
ఒమిక్రాన్పై డబ్ల్యూహెచ్వో తాజా వార్నింగ్.. డేంజరే..!
ఇప్పుడు ప్రపంచ దేశాలకు కరోనా మహమ్మారి పెద్ద సవాల్గా మారుతోంది.. ఓవైపు క్రమంగా డెల్టా, డెల్టా ప్లస్ కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా టెన్షన్ పెడుతోంది.. క్రమంగా కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇదే సమయంలో ఒమిక్రాన్ మృతుల సంఖ్య కూడా పెరుగుతూ కలవరానికి గురిచేస్తోంది.. ఒమిక్రాన్పై మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో). Read Also: కీచక రాఘవ…
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!