ఐఐటీ మద్రాస్ కీలక సర్వే: ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్ మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో వీకెంట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రోజువారీ కేసులు గత మూడు రోజులుగా లక్షకు పైగా నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇకపోతే, దేశంలో మూడో వేవ్ ఎప్పటి వరకు పీక్స్ కు వెళ్తుంది అనే దానిపై ఐఐటీ మద్రాస్ కీలక సర్వేను నిర్వహించింది.
Read: ‘పుష్ప’రాజ్ మాయలో పిల్లలు… అడ్డంగా దొరికేశారే!
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ఈ సర్వే ప్రకారం దేశంలో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 మధ్య మూడో వేవ్ పీక్స్కు వెళ్తుందని పేర్కొన్నది. దేశంలో డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు ఆర్ వ్యాల్యూ 2.9గా ఉంటే, జనవరి 1 నుంచి జనవరి 6 వరకు ఆర్ వ్యాల్యూ 4 గా నమోదైనట్టు ఐఐటీ మద్రాస్ పేర్కొన్నది. ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతున్నదని, క్వారంటైన్ నిబంధనల, ఆంక్షలను కఠినం చేస్తే వైరస్ స్ప్రెడ్ కావడం తగ్గుతుందని, ఫలితంగా ఆర్ వ్యాల్యూ తగ్గుతుందని ఐఐటి ప్రొఫెసర్ జయంత్ ఝా తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులు పీక్స్కు వెళ్లిన సమయంలో ఆర్ వ్యాల్యూ 1.69 మాత్రమే ఉన్నది. అయితే, మూడో వేవ్ ప్రారంభానికి మందే ఆర్ వ్యాల్యూ 2.9గా నమోదుకావడానికి కారణం ఒమిక్రాన్ వేరియంట్ అని, ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్నాయని, ఈ కొత్త వేరియంట్ డెల్టానే డామినెట్ చేస్తున్నది అనడానికి పెరుగుతున్న కేసులు, ఆర్ వ్యాల్యూనే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ మహమ్మారి ముప్పు నుంచి బయటపడొచ్చని ప్రొఫెసర్ ఝా పేర్కొన్నారు.
- Tags
- corona
- Covid 19
- Delta
- IIT
- IIT Madras
తాజావార్తలు
-
Tilak Varma – Sreeleela : శ్రీలీల – తిలక్ వర్మ.. టీ20 లవ్..?
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
-
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..