ఐఐటీ మద్రాస్ కీలక సర్వే: ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్ మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో వీకెంట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రోజువారీ కేసులు గత మూడు రోజులుగా లక్షకు పైగా నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇకపోతే, దేశంలో మూడో వేవ్ ఎప్పటి వరకు పీక్స్ కు వెళ్తుంది అనే దానిపై ఐఐటీ మద్రాస్ కీలక సర్వేను నిర్వహించింది.
Read: ‘పుష్ప’రాజ్ మాయలో పిల్లలు… అడ్డంగా దొరికేశారే!
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
ఈ సర్వే ప్రకారం దేశంలో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 మధ్య మూడో వేవ్ పీక్స్కు వెళ్తుందని పేర్కొన్నది. దేశంలో డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు ఆర్ వ్యాల్యూ 2.9గా ఉంటే, జనవరి 1 నుంచి జనవరి 6 వరకు ఆర్ వ్యాల్యూ 4 గా నమోదైనట్టు ఐఐటీ మద్రాస్ పేర్కొన్నది. ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతున్నదని, క్వారంటైన్ నిబంధనల, ఆంక్షలను కఠినం చేస్తే వైరస్ స్ప్రెడ్ కావడం తగ్గుతుందని, ఫలితంగా ఆర్ వ్యాల్యూ తగ్గుతుందని ఐఐటి ప్రొఫెసర్ జయంత్ ఝా తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులు పీక్స్కు వెళ్లిన సమయంలో ఆర్ వ్యాల్యూ 1.69 మాత్రమే ఉన్నది. అయితే, మూడో వేవ్ ప్రారంభానికి మందే ఆర్ వ్యాల్యూ 2.9గా నమోదుకావడానికి కారణం ఒమిక్రాన్ వేరియంట్ అని, ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్నాయని, ఈ కొత్త వేరియంట్ డెల్టానే డామినెట్ చేస్తున్నది అనడానికి పెరుగుతున్న కేసులు, ఆర్ వ్యాల్యూనే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ మహమ్మారి ముప్పు నుంచి బయటపడొచ్చని ప్రొఫెసర్ ఝా పేర్కొన్నారు.
- Tags
- corona
- Covid 19
- Delta
- IIT
- IIT Madras
తాజావార్తలు
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!