ఐఐటీ మద్రాస్ కీలక సర్వే: ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్ మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో వీకెంట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రోజువారీ కేసులు గత మూడు రోజులుగా లక్షకు పైగా నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇకపోతే, దేశంలో మూడో వేవ్ ఎప్పటి వరకు పీక్స్ కు వెళ్తుంది అనే దానిపై ఐఐటీ మద్రాస్ కీలక సర్వేను నిర్వహించింది.
Read: ‘పుష్ప’రాజ్ మాయలో పిల్లలు… అడ్డంగా దొరికేశారే!
Also Read
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
- Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
- IMD Alert: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండాలు.. దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఈ సర్వే ప్రకారం దేశంలో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 మధ్య మూడో వేవ్ పీక్స్కు వెళ్తుందని పేర్కొన్నది. దేశంలో డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు ఆర్ వ్యాల్యూ 2.9గా ఉంటే, జనవరి 1 నుంచి జనవరి 6 వరకు ఆర్ వ్యాల్యూ 4 గా నమోదైనట్టు ఐఐటీ మద్రాస్ పేర్కొన్నది. ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతున్నదని, క్వారంటైన్ నిబంధనల, ఆంక్షలను కఠినం చేస్తే వైరస్ స్ప్రెడ్ కావడం తగ్గుతుందని, ఫలితంగా ఆర్ వ్యాల్యూ తగ్గుతుందని ఐఐటి ప్రొఫెసర్ జయంత్ ఝా తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులు పీక్స్కు వెళ్లిన సమయంలో ఆర్ వ్యాల్యూ 1.69 మాత్రమే ఉన్నది. అయితే, మూడో వేవ్ ప్రారంభానికి మందే ఆర్ వ్యాల్యూ 2.9గా నమోదుకావడానికి కారణం ఒమిక్రాన్ వేరియంట్ అని, ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్నాయని, ఈ కొత్త వేరియంట్ డెల్టానే డామినెట్ చేస్తున్నది అనడానికి పెరుగుతున్న కేసులు, ఆర్ వ్యాల్యూనే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ మహమ్మారి ముప్పు నుంచి బయటపడొచ్చని ప్రొఫెసర్ ఝా పేర్కొన్నారు.
- Tags
- corona
- Covid 19
- Delta
- IIT
- IIT Madras
తాజావార్తలు
-
Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
-
Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
-
CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!