నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కరోనా కలకలం రేగింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులకు, 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపించారు. మొత్తం 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్షకేంద్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను షార్ అధికారులు విడుదల చేశారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు కరోనా సోకడంతో…
ఢిల్లీలో రోజు రోజుకు కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో పాటుగా విద్యాసంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు, జిమ్, స్పాలు మూసివేశారు. 50 శాతం సీటింగ్తో రెస్టారెంట్, మెట్రోలు కొనసాగుతున్నాయి. ఇక, కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నడుస్తున్నాయి. జనవరి 3 వ తేదీన 4099 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పాజిటివిటీ రేటు 6.46శాతంగా ఉన్నది. Read: గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు…
దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు గోవా వెళ్లారు. నూతన సంవత్సర వేడుకల తరువాత ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ముంబై పోర్ట్ నుంచి గోవాకు కార్డెలియా క్రూజ్ షిప్ వెళ్లింది. అయితే, 2000 మంది టూరిస్టులతో బయలుదేరిన…
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభన మొదలైంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో ఆంక్షలు విధించారు. అయితే తాజాగా భారత్లోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు తెలంగాణలో పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు.…
గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికీ వీడనంటోంది. కరోనా డెల్టా వేరియంట్తోనే సతమతమవుతుంటే తాజాగా మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. అయితే తాజాగా ఏపీలో 15,568 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 122 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అంతేకాకుండా గడచిన 24 గంటల్లో 103 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు, ఒకరు కరోనా బారినపడి మరణించినట్లు వైద్యాశాఖ అధికారులు…
ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే 1700 కేసులు దాటిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఒమిక్రాన్ మహమ్మారి. తీవ్రత తక్కువగానే వున్నా జనం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే.. దేశంలో వారం రోజుల్లో 5 రెట్లు పెరిగాయి కోవిడ్ కేసులు. గోవా వీధుల్లో బాగా బీచ్ సమీపంలో తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు కోవిడ్ వీరవిహారం చేస్తున్న వేళ వేలాదిమంది న్యూ ఇయర్ వేడుకల్లో…
తెలంగాణలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణలో 274 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో 84 కేసులకు చేరింది. ఇప్పటివరకూ ఒమిక్రాన్ నుంచి 32మంది కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. తెలంగాణలో 3779 కరోనా యాక్టివ్ కేసులు వున్నాయి. మొత్తం 21,679 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 274 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. మరోవైపు తెలంగాణలో కేసుల తీవ్రత…
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఒమిక్రాన్ రాకతో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది యూఎస్లో అత్యధిక సంఖ్యలో రెండు లక్షల వరకు కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది, ఆ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఒక్కరోజులో 4 నుంచి 5 లక్షల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో 30 నుంచి 40 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల పెరుగుదల కారణంగా ఆసుపత్రులపై…
దేశంలో కరోనా కేసులు అంతకంతకు భారీగా పెరుగుతున్నాయి. 20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. థర్డ్ వేవ్ వచ్చినా ఇబ్బందులు లేకుండా మందులు, ఆసుపత్రులు, ఆక్సీజన్ను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, వైద్యరంగంపై పెనుభారం పడుతుందని,…
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు గోవాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. గోవా పర్యాటక రాష్ట్రం కావడంతో అక్కడ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అయితే, గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తుండటంతో వేడుకలకు దూరంగా ఉన్నారు. డిసెంబర్లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు వాటిని పట్టించుకోకుండా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు పెద్ద ఎత్తున గోవా చేరుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. వరసగా సెలవులు రావడంతో టూరిస్టులు పోటెత్తారు.…