టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పటికే భారత్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇప్పటికే 27 రాష్ట్రాలకు పాకింది.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 3 వేలను దాటేశాయి.. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులందరూ వారం రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 11వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ మధ్యే ఇటలీ నుంచి అమృత్సర్కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో అప్రమత్తమైన కేంద్రం.. కొత్త నిబంధనలు విధించింది. మరోవైపు.. ఒమిక్రాన్ కేసులు భారీస్థాయిలో వెలుగు చూస్తుండడంతో.. ఎట్రిస్క్ దేశాల జాబితాను కూడా పెంచింది కేంద్రం.. యూకే, మిగతా యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా దేశాలను ఎట్రిస్క్ దేశాలుగా పేర్కొంది.
Read Also: ప్రధాని మోడీ పంజాబ్ టూర్లో భద్రతా వైఫల్యం.. 150 మందిపై కేసులు..
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
- Modi-Trump: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వేగం.. ఏఐ రంగంలో సహకారానికి రెడీ
- India - Iran Talks: ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై కీలక చర్చలు.. భారత్ తదుపరి అడుగు ఏంటి?
ఇక, కేంద్రం సవరించిన తర్వాత మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
- విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ వివరాలతో పాటు 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను పోర్టల్లో నమోదు చేయాలి.
- తమ ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాలి.
- స్వదేశంలో అడుగుపెట్టగానే ఎయిర్పోర్ట్లోనే కరోనా టెస్ట్ చేయించుకోవాలి. వాటి ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి.
- ఎయిర్పోర్ట్లో కరోనా టెస్ట్ కోసం ముందుగానే సువిధ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలి.
- కరోనా టెస్ట్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్కు తరలించాలి.
- కోవిడ్ నెగెటివ్గా తేలితే వారం రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి.
- నెగెటివ్గా తేలినవారు 8వ రోజు మరోసారి ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.. మళ్లీ నెగిటివ్ వస్తే మరో వారం పాటు ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి.
- ఎట్ రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్లో టెస్ట్ చేయించుకోవాలి.. నెగెటివ్ వచ్చినా హోంక్వారంటైన్ తప్పనిసరి.
- విదేశాల నుంచి వచ్చిన ఐదేళ్లలోపు చిన్నారులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజావార్తలు
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
-
Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!