టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పటికే భారత్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇప్పటికే 27 రాష్ట్రాలకు పాకింది.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 3 వేలను దాటేశాయి.. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులందరూ వారం రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 11వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ మధ్యే ఇటలీ నుంచి అమృత్సర్కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో అప్రమత్తమైన కేంద్రం.. కొత్త నిబంధనలు విధించింది. మరోవైపు.. ఒమిక్రాన్ కేసులు భారీస్థాయిలో వెలుగు చూస్తుండడంతో.. ఎట్రిస్క్ దేశాల జాబితాను కూడా పెంచింది కేంద్రం.. యూకే, మిగతా యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా దేశాలను ఎట్రిస్క్ దేశాలుగా పేర్కొంది.
Read Also: ప్రధాని మోడీ పంజాబ్ టూర్లో భద్రతా వైఫల్యం.. 150 మందిపై కేసులు..
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
ఇక, కేంద్రం సవరించిన తర్వాత మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
- విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ వివరాలతో పాటు 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను పోర్టల్లో నమోదు చేయాలి.
- తమ ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాలి.
- స్వదేశంలో అడుగుపెట్టగానే ఎయిర్పోర్ట్లోనే కరోనా టెస్ట్ చేయించుకోవాలి. వాటి ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి.
- ఎయిర్పోర్ట్లో కరోనా టెస్ట్ కోసం ముందుగానే సువిధ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలి.
- కరోనా టెస్ట్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్కు తరలించాలి.
- కోవిడ్ నెగెటివ్గా తేలితే వారం రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి.
- నెగెటివ్గా తేలినవారు 8వ రోజు మరోసారి ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.. మళ్లీ నెగిటివ్ వస్తే మరో వారం పాటు ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి.
- ఎట్ రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్లో టెస్ట్ చేయించుకోవాలి.. నెగెటివ్ వచ్చినా హోంక్వారంటైన్ తప్పనిసరి.
- విదేశాల నుంచి వచ్చిన ఐదేళ్లలోపు చిన్నారులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజావార్తలు
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..