టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పటికే భారత్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇప్పటికే 27 రాష్ట్రాలకు పాకింది.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 3 వేలను దాటేశాయి.. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులందరూ వారం రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 11వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ మధ్యే ఇటలీ నుంచి అమృత్సర్కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో అప్రమత్తమైన కేంద్రం.. కొత్త నిబంధనలు విధించింది. మరోవైపు.. ఒమిక్రాన్ కేసులు భారీస్థాయిలో వెలుగు చూస్తుండడంతో.. ఎట్రిస్క్ దేశాల జాబితాను కూడా పెంచింది కేంద్రం.. యూకే, మిగతా యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా దేశాలను ఎట్రిస్క్ దేశాలుగా పేర్కొంది.
Read Also: ప్రధాని మోడీ పంజాబ్ టూర్లో భద్రతా వైఫల్యం.. 150 మందిపై కేసులు..
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
ఇక, కేంద్రం సవరించిన తర్వాత మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
- విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ వివరాలతో పాటు 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను పోర్టల్లో నమోదు చేయాలి.
- తమ ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాలి.
- స్వదేశంలో అడుగుపెట్టగానే ఎయిర్పోర్ట్లోనే కరోనా టెస్ట్ చేయించుకోవాలి. వాటి ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి.
- ఎయిర్పోర్ట్లో కరోనా టెస్ట్ కోసం ముందుగానే సువిధ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలి.
- కరోనా టెస్ట్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్కు తరలించాలి.
- కోవిడ్ నెగెటివ్గా తేలితే వారం రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి.
- నెగెటివ్గా తేలినవారు 8వ రోజు మరోసారి ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.. మళ్లీ నెగిటివ్ వస్తే మరో వారం పాటు ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి.
- ఎట్ రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్లో టెస్ట్ చేయించుకోవాలి.. నెగెటివ్ వచ్చినా హోంక్వారంటైన్ తప్పనిసరి.
- విదేశాల నుంచి వచ్చిన ఐదేళ్లలోపు చిన్నారులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
-
Betting: కోట్లు కురిపించే ‘క్రికెట్ బెట్టింగ్’ డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
-
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!