తెలంగాణలో యథావిధిగా స్కూళ్లు నడపాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సైతం స్కూళ్లు నడపాల్సిందేనని సీఎం చెప్పారని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిద్దామని, కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రిస్క్ అధికంగా ఉన్న దేశాలనుంచి వచ్చే ప్రయాణికలపై కొత్త రూల్స్ను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఈరోజు అర్థరాత్రి నుంచి కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ భయంతో ఇండియాలో ఉన్న వివిధ దేశాల ప్రజలు తిగిరి సొంత దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో విమానం చార్జీలు భారీగా పెరిగాయి. ఢిల్లీ నుంచి యూకే, యూఎస్,…
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించాల్సి ఉంది. వింటర్ ఒలింపిక్స్ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నది చైనా. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఒమిక్రాన్ సవాళ్లను ఎదుర్కొని తప్పకుండా వింటర్ ఒలింపిక్స్ను నిర్వహిస్తామని చైనా చెబుతున్నది. Read: స్మార్ట్ఫోన్ ఎఫెక్ట్: గతం మర్చిపోయిన యువకుడు… మహమ్మారిని ఎదుర్కొనడంలో చైనాకు చాలా అనుభవం ఉందని, ఒమిక్రాన్ వేరియంట్…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించాలనే నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం నిలబడాల్సిన ప్రయాణీకుల కోసం విమానాశ్రయంలో కుర్చీలను వరుసగా హోల్డింగ్ ఏరియాలలో ఏర్పాటు…
ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే తెలంగాణాలో అన్ని చోట్ల వైద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ను కూడా వేగంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని వారు వెంటనే వేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణి కుంలందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామన్నారు. ఒకవేళ వారికి…
ప్రస్తుతం కరోనా అదుపులో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ అన్నారు. ఇందుకు సంబంధించి ఇవాళ రాజ్య సభలో ఒమిక్రాన్ వేరియంట్ చర్చకు వచ్చింది. అసలు కేసులు ఉన్నాయ అని సభ్యలు ప్రశ్నించారు. ఈ మేరకు రాజ్యా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని రాజ్యాసభలో స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.…
ఒమిక్రాన్ పేరు వింటే ప్రపంచం గజగజవణికిపోతోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ఒమిక్రాన్ను గుర్తించారు. ఆ తరువాత ప్రపంచాన్ని ఈ వేరియంట్ గురించి హెచ్చరికలు జారీ చేయడంతో ఆన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. నిన్నటి రోజున జపాన్ వీదేశీయులపై నిషేదం విధించింది. ఇలా నిషేదం విధించిన మరుసటిరోజే జపాన్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం… అప్రమత్తమైన యంత్రాంగం… నమీబియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి ప్రభుత్వ నిబంధనల…
కరోనా సమయంలో అనేక కంపెనీలు వర్క్ఫ్రమ్ హోమ్ను ఇచ్చేశాయి. కరోనా మొదటి, సెకండ్ వేవ్ తరువాత నెమ్మదిగా ప్రపంచం కోలుకుంటోంది. కరోనా నుంచి బయటపడుతుండటంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. కొన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. 2022 జనవరి వరకు అన్ని కంపెనీలు వర్క్ఫ్రమ్ హోమ్ పక్కన పెట్టి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. Read: ఒమిక్రాన్ వేరియంట్పై మోడెర్నా సీఈఓ సంచలన వ్యాఖ్యలు……
ఒమిక్రాన్ వేరియంట్పై మోడెర్నా సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్కు అడ్డుకట్ట వేయలేవని అన్నారు. మోడెర్నా సీఈఓ స్టీఫెన్ బాన్సెల్ చేసిన కామెంట్లు ప్రపంచం మొత్తాన్ని కుదిపేశాయి. స్టీఫెన్ చేసిన ఈ వ్యాఖ్యలతో షేర్ మార్కెట్లు దద్దరిల్లిపోయాయి. అటు క్రూడాయిల్ ధరలు భారీగా క్షీణించాయి. ప్రపంచంలోని అన్ని వ్యాక్సిన్లు అన్ని దేశాల్లో ఒకే రకమైన సామర్థ్యంతో పనిచేయబోవని, అందుకే డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిందని, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిత్ర పరిశ్రమ అయితే కరోనా దెబ్బకు కుదేలయిపోయింది. ఇప్పుడిప్పుడే అన్నింటికి, అందరికి మంచి రోజులు వస్తున్నాయి.. త్యేతర్లు కళకళలాడుతున్నాయి అనుకొనేలోపు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బి.1.1.529 మరో సవాల్ విసురుతోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్వో చెప్తున్న తరుణంలో ఓమిక్రాన్ కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పటికే వాయిదాల మీద వాయిదాల వేస్తూ వస్తున్నా సినిమాలు పరిస్థితి అయితే దారుణమని…