తెలంగాణలో ఓమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులు వాడని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిమానాల జాతర మొదలైంది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకున్నా, డ్రంక్ డ్రైవ్లో పట్టుబడ్డా చలానాలు రాస్తున్నారు. ఇప్పుడేమో కోవిడ్ తీవ్రత పెరగడంతో మళ్ళీ జరిమానాలు మొదలయ్యాయి. భద్రాచలంలో మాస్కుల జరిమానాలు షురూ అయ్యాయి. భద్రాచలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10 మందికి 10 వేలు జరిమానా విధించారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీపతి తిరుపతి. దేశంలో ఓమిక్రాన్ అలజడి రేగడంతో తెలంగాణ…
ఒమిక్రాన్ పై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ సందర్భంగా లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. పోలియోకి వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చిందని, కరోనాకు వేగంగా వ్యాక్సిన్ తీసుకొచ్చిన ఘనత మనదేన్నారు. ఇప్పటికే దేశంలో హర్ఘర్ దస్తక్ కార్యక్రమం ద్వారా దేశంలో ప్రతి పౌరునికి ఉచిత టీకాను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా…
ఆందోళన వద్దు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు మంత్రి హరీష్రావు.. ఇవాళ బాలానగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖానను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు.. కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు…
కరోనా మహమ్మారి టెన్షన్ నుంచి ప్రపంచదేశాలు ఇప్పట్లో బయటపడేలా కనిపించడంలేదు పరిస్థితి.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. జెట్ స్పీడ్తో ప్రపంచదేశాలను చుట్టేస్తోంది.. గత నెల 24వ తేదీన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడగా… కేవలం తొమ్మిది రోజుల్లోనే 30 దేశాలకు వ్యాప్తి చెందింది.. అందులో భారత్ కూడా ఉండడం మరింత కలవరపెట్టే విషయం.. ఇక, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. సౌతాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు…
కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చి మరోసారి అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ తాజాగా భారత్లోకి కూడా ప్రవేశించింది. అయితే నవంబర్ 11న ఓ 66ఏళ్ల వ్యక్తి బెంగుళూరు ఎయిర్పోర్టుకు వచ్చాడు, నవంబర్ 20న 46 ఏళ్ల మరో వ్యక్తి కూడా బెంగుళూరు ఎయిర్పోర్టుకు వచ్చాడు. అయితే అందరికీ చేసినట్లుగానే వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదు. ఎప్పటి వరకు బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మొదట సౌతాఫ్రికాలో బయటపడింది. ఆ ఈ వేరియంట్ను గుర్తించిన వెంటనే సౌతాఫ్రికా అన్ని దేశాలను అలర్ట్ చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం సౌతాఫ్రికా వెంటనే అలర్ట్ చేయడాన్ని ప్రశంసించింది. అయితే, మూడు రోజుల వ్యవధిలోనే 30 దేశాలకు కరోనా వ్యాపించడంతో దీని ప్రభావం ఎంతగా ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. Read: రికార్డ్:…
కరోనా మహమ్మారి జర్మనీలో విజృంభిస్తోంది. ఇప్పటికే జర్మనీలో కోవిడ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో రోజుకు 76 వేల పై చిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జర్మనీలో ప్రవేశించింది కూడా. దీంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది. తాజా కేసులతో అక్కడి ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోవడంతో ఏకంగా వైమానిక దళాన్ని కూడా జర్మనీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. అంతేకాకుండా కరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్డౌన్ను కూడా విధిస్తున్నట్లు…
ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఓమిక్రాన్ వేరింయట్ తాజగా దేశంలో కూడా వ్యాప్తి చెందడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. దీంతో కరోనాకు సంబంధించిన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు కేజ్రివాల్ సర్కార్ సిద్ధమైంది. 30,000 కంటే ఎక్కువ కోవిడ్ పడకలు, ఆక్సిజన్ సరఫరాను పెంచడంతో ఓమిక్రాన్ ఎదుర్కొంటామన్నారు. 442 MT ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, 21 MT ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……
యావత్తు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కరోనా మహమ్మరి రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు పలు దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. నేడు ఇండియాలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే తాజాగా ఒమిక్రాన్పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) పలు సూచనలు చేసింది. దక్షిణాఫ్రికాలోని యువత తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించింది. కరోనా వేరియంట్లతో పొల్చితే…
కరోనా ప్రపంచాన్ని నిద్రపోనివ్వకుండా చేస్తే, ఒమిక్రాన్ అంతకు మించి కలవరపెడుతున్నది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కావడంతో ఈ వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే 29 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. నిన్న యూఎస్లో ఒక కేసు నమోదవ్వగా, ఈరోజు ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు 379 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు…