ఓమిక్రాన్ ముప్పును ఎదుర్కోవడానికి ఢిల్లీ సిద్ధం: సీఎం కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఓమిక్రాన్ వేరింయట్ తాజగా దేశంలో కూడా వ్యాప్తి చెందడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. దీంతో కరోనాకు సంబంధించిన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు కేజ్రివాల్ సర్కార్ సిద్ధమైంది. 30,000 కంటే ఎక్కువ కోవిడ్ పడకలు, ఆక్సిజన్ సరఫరాను పెంచడంతో ఓమిక్రాన్ ఎదుర్కొంటామన్నారు. 442 MT ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, 21 MT ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఢిల్లీలో ఉన్న పరిస్థితులను వివరించారు.
కరోనావైరస్, ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళన పెడుతుంది. ఇది భారతదేశంలోకి ప్రవేశించకూడదని లేదా వ్యాప్తి చెందదని మేము ఆశిస్తున్నామని ప్రార్థిస్తున్నాము. ఒకవేళ ఈ ముప్పు సంభవించే అవకాశం ఉన్నట్లయితే, వైరస్ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సన్నాహాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవడం బాధ్యతయుతమైన ప్రభుత్వంగా మా కర్తవ్యం అని కేజ్రీవాల్ తెలిపారు.
Also Read
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్కే ఓటు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
ఆక్సిజన్ కొరతను నివారించడానికి 6,000 ఆక్సిజన్ సిలిండర్లు దిగుమతి చేసుకున్నామని,15 ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. దాదాపు 97% మంది ఢిల్లీ వాసులు టీకా మొదటి డోస్ను వేసుకున్నారన్నారు. 57శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారన్నారు. ఢిల్లీ ప్రజలు తమ రెండవ డోస్ను త్వరగా వేసుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. పడకల విషయానికొస్తే, మే 2021లో రెండవ వేవ్లో ఆసుపత్రులలో పడకల సామర్థ్యాన్ని 25,106కి పెంచామని, ఇప్పుడు 30,000 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో 10,000 ICU పడకలు ఉన్నాయన్నారు. అదనంగా మరో 6,800 ఐసియు పడకలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయన్నారు.
ఫిబ్రవరి 2022 నాటికి ఇవి కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరలో ఐసియు పడకల సామర్థ్యాన్ని 17,000 వరకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెండు వారాల నోటీసుపై ప్రతి మున్సిపల్ వార్డులో 100 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసే విధంగా మేము మా సన్నాహాలు చేస్తున్నామన్నారు. 270 వార్డులకు, 27,000 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 63,800 పడకలను తీసుకు వచ్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!