ఒమిక్రాన్పై ఆందోళన వద్దు.. ఇవి చేస్తే చాలు-మంత్రి హరీష్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆందోళన వద్దు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు మంత్రి హరీష్రావు.. ఇవాళ బాలానగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖానను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు.. కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవడం ప్రజలు చేతుల్లో ఉందని తెలిపిన మంత్రి.. వ్యాక్సిన్ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, భౌతికదూరం పాటించాలని సూచించారు.
Read Also: పీఆర్సీపై గుడ్న్యూస్ చెప్పిన సీఎం జగన్
Also Read
ఇక, ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ వేసుకోవాడనికి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి హరీష్రావు.. అంతా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.. రాష్ట్రంలో 2 కోట్ల 51 లక్షల మంది మాత్రమే మొదటి టీకా వేసుకున్నారని.. రెండు డోసులు వేసుకోండి.. ప్రాణాపాయం ఉండదన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 80 లక్షల వాక్సిన్ స్టాక్ ఉందని తెలిపిన ఆయన.. లోకల్ కార్పొరేటర్ ఎన్నికల సమయంలో ఎలా ఓటు కోసం వెళ్లారో… ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించాలని ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదు, కర్ణాటకలో వచ్చిందని కేంద్ర వైద్య అధికారులు ప్రకటించారన్న ఆయన.. విదేశాల నుంచి దేశంలోకి వచ్చేవారికి ఎయిర్పోర్ట్లో టెస్ట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇక, బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఆమె శాంపిల్ జీనోమ్ సీక్వెన్స్ కి పంపించాము, రిపోర్ట్ రావడం కోసం 3 నుంచి 4 రోజులు సమయం పడుతుందన్నారు మంత్రి హరీష్రావు.
తాజావార్తలు
-
VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!