ఒమిక్రాన్పై ఆందోళన వద్దు.. ఇవి చేస్తే చాలు-మంత్రి హరీష్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆందోళన వద్దు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు మంత్రి హరీష్రావు.. ఇవాళ బాలానగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖానను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు.. కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవడం ప్రజలు చేతుల్లో ఉందని తెలిపిన మంత్రి.. వ్యాక్సిన్ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, భౌతికదూరం పాటించాలని సూచించారు.
Read Also: పీఆర్సీపై గుడ్న్యూస్ చెప్పిన సీఎం జగన్
Also Read
ఇక, ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ వేసుకోవాడనికి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి హరీష్రావు.. అంతా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.. రాష్ట్రంలో 2 కోట్ల 51 లక్షల మంది మాత్రమే మొదటి టీకా వేసుకున్నారని.. రెండు డోసులు వేసుకోండి.. ప్రాణాపాయం ఉండదన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 80 లక్షల వాక్సిన్ స్టాక్ ఉందని తెలిపిన ఆయన.. లోకల్ కార్పొరేటర్ ఎన్నికల సమయంలో ఎలా ఓటు కోసం వెళ్లారో… ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించాలని ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదు, కర్ణాటకలో వచ్చిందని కేంద్ర వైద్య అధికారులు ప్రకటించారన్న ఆయన.. విదేశాల నుంచి దేశంలోకి వచ్చేవారికి ఎయిర్పోర్ట్లో టెస్ట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇక, బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఆమె శాంపిల్ జీనోమ్ సీక్వెన్స్ కి పంపించాము, రిపోర్ట్ రావడం కోసం 3 నుంచి 4 రోజులు సమయం పడుతుందన్నారు మంత్రి హరీష్రావు.
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!