Off The Record: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎంపిక వ్యవహారం జీడిపాకం సీరియల్లా సాగుతూనే ఉంది. చాలా రోజుల క్రితమే.. రామచంద్ర నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఏఐసీసీ. ఇప్పుడంతా ఆయన్ని డిప్యూటీ స్పీకర్ అనే పిలుస్తున్నారుగానీ… ఎన్నిక మాత్రం జరగలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ అవలేదు. విప్ గా ఉండే నాయక్ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఈ సెషన్లో అయినా ఎన్నిక జరుగుతుందని అనుకున్నా……
Off The Record: కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆఫీస్ వ్యవహారాల గురించి ఇప్పుడు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు నియోజకవర్గంలో. సప్త సముద్రాలు ఈదిన గజ ఈతగాడు పిల్ల కాలువలో పడి కాళ్ళు విరగ్గొట్టుకున్నట్టుంది ఆయనగారి వ్యవహారం అంటూ సెటైర్స్ వేసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇంతకీ.. మేటర్ ఏంటంటే….. ఈ ఎన్నారై టర్న్డ్ ఎమ్మెల్యే గెలిచాక గుడివాడలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. తాను అందుబాటులో లేని సమయంలో రకరకాల పనుల కోసం వచ్చే నియోజకవర్గ ప్రజలకు…
Off The Record: అటు పార్టీ… ఇటు పరిపాలన… రెండిటిని త్రాసులో తూకం వేసి మరీ… ఈసారి టైం కేటాయిస్తున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అంతకు ముందు అధికారంలో ఉంటే పార్టీని పట్టించుకోరన్న విమర్శలు ఆయన మీద ఉన్నాయి. అందుకే ఈసారి మాత్రం వాటికి చెక్ పెడుతూ… బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ విడతలో మాత్రం… ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వ్యవహారాలను లైట్ తీసుకునే ప్రసక్తే లేదని ముందే చెప్పారాయన. ఇప్పుడు…
Off The Record: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నా… పూర్తిగా సమయం కేటాయించలేని పరిస్థితి. అందుకే.. నియోజకవర్గంలోని పార్టీ కేడర్, పనులు, అధికారులతో సమన్వయ బాధ్యతల్ని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అప్పగించారు. అంతకు ముందు కూడా పిఠాపురం కో ఆర్డినేటర్గా ఉన్నారాయన. అయితే…మొదట్లో బాగానే ఉన్నా…. రానురాను కాకరకాయ కీకరకాయగా మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. అందర్నీ సమన్వయం చేసుకుంటూ… తాను…
Off The Record: టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఆ నియోజకవర్గ రాజకీయం మారిపోయిందా? జనసేన ఎమ్మెల్యేతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఓ వర్గం సొంత నాయకుల మీదే కత్తులు దూస్తోందా? అవకాశాల కోసం దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టిన ఇద్దరు సీనియర్స్… రెండేళ్ళు తిరక్కముందే పాత పగల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా? ఎక్కడ జరుగుతోందా ఎపిసోడ్? ఎవరా ఇద్దరు నాయకులు? ఆంధ్రప్రదేశ్ కూటమిలో కుంపట్లు అంటుకోవడం మొదలై చాలా రోజులైంది. పై స్థాయిలో, పెద్ద నాయకులంతా పరస్పరం పొగుడుకుంటూ……
Off The Record: ఆ నాయకుడు మళ్ళీ గుడ్ మార్నింగ్ అంటూ జనం మధ్యకు రాబోతున్నారా? గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కమ్మేసిన వైరాగ్యం ఇప్పుడు పూర్తిగా పోయిందా? ఇప్పుడు మళ్లీ ఎందుకు జనంలోకి రావాలనుకుంటున్నారాయన? జనం ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటా శుభోదయం కథకమామీషు? ఏపీ పాలిటిక్స్లో గుడ్ మార్నింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం…
వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశాకిరణ్ అసలు వ్యూహం ఏంటి? ప్రజల్లో ఉంటానంటారు, రాజకీయాల్లోకి రానంటారు. తన తండ్రికి సరైన గుర్తింపు దక్కలేదంటూ ఇన్నేళ్ళ తర్వాత వాదన వినిపిస్తున్నారు. ఇంతకీ ఏం కోరుకుంటున్నారు ఆశాకిరణ్? తాను గందరగోళంలో ఉన్నారా? లేక వ్యూహాత్మకంగా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఆశాకిరణ్…దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె. ఆమె వ్యవహారశైలి ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. ఇక నుంచి ప్రజల్లోనే ఉంటానని రెండు నెలల క్రితం ప్రకటించారామె. రాధా…
పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అందినకాడికి కుమ్మేస్తున్నార్రా నాయనో…. అని ఇన్నాళ్లు నెత్తీ నోరు బాదుకున్నా పట్టించుకోని ఆ ఎమ్మెల్యే ఇప్పుడు సడన్గా సీరియస్ అవుతున్నారు. ఇప్పటిదాకా ఏం చెప్పినా… వినిపించుకోని సదరు శాసనసభ్యుడు ఇప్పుడు బోధి వృక్షం కింద కూర్చున్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు. పైగా తాను మోసపోయానని…. నమ్మిన వాళ్ళే ముంచారంటూ అమాయకపు ఫేస్ ఒకటి. పొలిటికల్ నవరసాలు పండిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనలో మార్పునకు అమరావతి నుంచి వచ్చిన ఆఫరే కారణమా?…
Off The Record: వైసీపీ సోషల్ మీడియా సైన్యం ఇప్పుడు ఆ పార్టీకి ప్రధాన ఆయుధంగా మారిందట. ప్రజా సమస్యలను వైరల్ కంటెంట్గా మార్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కీలక శక్తిగా ఎదుగుతోందని తెలుస్తోంది. కూటమి వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఒకేసారి కోట్ల మందికి చేరవేస్తోంది. జగన్ మాటను వక్రీకరణ లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇస్తోందని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. పల్లె నుంచి పట్టణం వరకూ విస్తరించిన ఈ డిజిటల్ సైన్యమే వైసీపీ…
Off The Record: విజయనగరం జిల్లా టీడీపీలో తొలినాళ్ల నుంచి ఒకే ఒక సెంటర్ ఆఫ్ పవర్ ఉండేది. ఆ బంగ్లాలో తీసుకున్న నిర్ణయమే పార్టీ హైమాకమాండ్కు సైతం శిరోధార్యమట. గవర్నర్ గిరి నుంచి గ్రామస్థాయి ఆఫీస్ బేరర్ వరకు ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అక్కడే డిసైడ్ అవుతుందన్నది ఓపెన్ సీక్రెట్. ఆ సంప్రదాయానికి కేంద్రబిందువు అశోక్ గజపతి రాజు. ఆయన మాటకు టీడీపీ అధినేత సైతం సై అనేవారని తెలుస్తోంది. అందుకే విజయనగరం టీడీపీలో…