ఏపీపై బీజేపీ హైకమాండ్ ఆశలు వదిలేసుకుందా? తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యతలో ఒక్కశాతం కూడా ఏపీకి ఎందుకు ఇవ్వడంలేదు? ఎంత చేసినా అక్కడ నుంచి అంతకు మించి వచ్చేది ఏమీలేదని డిసైడ్ అయ్యిందా? లేక పదవులు పొందేస్థాయి ఉన్న నేతలెవరూ లేరనా? పదవుల పందేరంలో ఆంధ్రప్రదేశ్ను ఆరో వేలిలా చూస్తోంది అందుకేనా? ఏపీ బీజేపీకి ఒకటి అరా పదవులే..! ఏపీ బీజేపీ శాఖను ఆ పార్టీ హైకమాండ్ లైట్ తీసుకుంటున్నట్టుంది. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల్లో రాష్ట్రానికి ఇస్తున్న…
శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ మధ్య టీడీపీ దీన్ని బాగా ఫాలో అవుతోంది. ఒకప్పటి ఆప్త మిత్రుడు పవన్కు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన్ను వైసీపీ విమర్శిస్తే టీడీపీ కస్సుమని ఒంటి కాలిపై లేస్తోంది. అది పార్టీలోని ఓ వర్గ నేతలకు అస్సలు నచ్చడం లేదట. మనల్ని పట్టించుకోని అతనికేంటి అంత ప్రయార్టీ అంటూ ఒకటే గుసగుసలు.. రుసరుసలట..! ఇటీవల పవన్కు అండగా టీడీపీ కామెంట్స్..! ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే పొత్తులు.. సమీకరణాలు…
నందికొట్కూరు వైసీపీ గురించి చెబితే.. అక్కడి నాయకుల కంటే.. వారి మధ్య ఆధిపత్యపోరే ఎక్కువ హైలెట్. ఎమ్మెల్యే ఆర్థర్, పార్టీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉప్పు నిప్పులా ఉంటారు. వారే కాదు.. వారి అనుచరులు కూడా అంతే. ఇప్పుడు కొత్త గొడవ ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. అదేంటో లెట్స్ వాచ్..! ఆధిపత్యపోరులో దాడులు.. హత్యాయత్నాలు..! కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య…
డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన కామెంట్స్ ఆ పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయా? రాజకీయ లబ్ధికోసం గుడ్డిగా ఏదేదో మాట్లాడి ఓ సామాజికవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితి దాపురించిందా..? కాకినాడ ఎపిసోడ్ తర్వాత టీడీపీలో వినిపిస్తున్న గుసగుసలేంటి.. రుసరుసలేంటి..? కాకినాడలో పట్టాభి కామెంట్స్ కలకలం..! ముంద్రా పోర్టులో హెరాయిన్ పట్టుబడిన అంశాన్ని అధికార వైసీపీకి చుట్టేస్తూ.. టీడీపీ పెద్దఎత్తున ప్రెస్మీట్ల పోరాటం చేస్తోంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయేంత వరకు టీడీపీలో చంద్రబాబు…
హుజురాబాద్ ఉపఎన్నికను కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంటుందా? ఇంకా గ్రౌండ్లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు? పరువుకు ప్రాధాన్యం ఇచ్చి.. ఫలితం గాలికి వదిలేసిందా? ఇంకా మొదలు కాని కాంగ్రెస్ ప్రచారం..! హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుంచి నాన్ సీరియస్సే. గాంధీభవన్లో ఉపఎన్నిక సందడే లేదు. అసలు రాష్ట్రంలో ఒక ఉపఎన్నిక జరుగుతుందనే సోయి పార్టీ నేతల్లో ఉందో లేదో అనే డౌట్ కేడర్ది. మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దించాలని భావించి భంగపడింది. ఆమె…
ఆ మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ కీలకంగా భావించే ప్రాంతానికి చెందిన నాయకుడు. నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జ్ కూడా. ఆయనకు తెలియకుండానే అక్కడ కొందరికి పార్టీ పదవులు ఇచ్చేశారు. పార్టీ ఆయన్ని పట్టించుకోవడం లేదా? సైడ్ చేసిందా? లైట్ తీసుకుంటుందా? ఎవరా నాయకుడు? ఏంటా ప్రాంతం? శ్రావణ్ కుమార్కు చెప్పకుండానే స్థానికులకు టీడీపీలో పదవులు..! శ్రావణ్ కుమార్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే. రాజధాని అమరావతిలోని కీలక నియోజకవర్గమైన తాడికొండలో 2014లో టీడీపీ నుంచి గెలిచారు. గత ప్రభుత్వం అమరావతికి…
ఒక ఎమ్మెల్సీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతా ఒకే పార్టీ. సంస్థాగత కమిటీల కూర్పులో కలిసి సాగుతున్నారా అంటే.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్..! అనుచరులను అందలం ఎక్కించేందుకు ఏకంగా బలప్రదర్శన మొదలెట్టేసి.. గులాబీ శిబిరంలో గుబులు రేపుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా కథా? వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్లో వర్గపోరులో కొత్త పోకడలు..! ఏదైనా పదవొచ్చినా.. పెద్ద నాయకుడు పార్టీలో చేరినా.. ఈ స్థాయిలో టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర సందడి కామన్. కానీ.. ఒక జిల్లా…
విశాఖ వైసీపీలో అంతర్గత సర్వే టెన్షన్ పుట్టిస్తోందా? ఎమ్మెల్యేల పనితీరుకు హైకమాండ్ గీటురాయి పెట్టిందా? ఈ నివేదికలు కొందరు శాసనసభ్యుల భవిష్యత్ను నిర్దేశిస్తాయా? నెగెటివ్ స్కోర్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? పార్టీ నేతలు ఆరా తీస్తున్నారా? వైసీపీ నేతల్లో అంతర్గత సర్వేపై టెన్షన్..! 2019 ఎన్నికల్లో తెలుగుదేశం కంచుకోటలను బద్ధలు కొట్టింది వైసీపీ. ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వేగా పిలుచుకునే విశాఖజిల్లాలో 11 అసెంబ్లీ సీట్లు.. మూడు ఎంపీ స్ధానాలను కైవశం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన ఈ…
హుజురాబాద్లో బీజేపీ తరఫున ప్రచారానికి జాతీయ నాయకులు వస్తారా.. లేదా? EC ఆంక్షలు చూశాక కమలనాథులు మార్చిన వ్యూహం ఏంటి? అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ నేతల దూకుడికి ఈసీ ఆంక్షలు బ్రేక్..! ఉపఎన్నిక షెడ్యూల్ రాకమునుపే హుజురాబాద్లో ప్రచారం ప్రారంభించింది బీజేపీ. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక.. ప్రచారాన్ని మరో అంకానికి తీసుకెళ్లే పనుల్లో ఉన్నారు కమలనాథులు. రాష్ట్రస్థాయి నాయకులు.. సీనియర్ నేతలు.. పార్టీ కేడర్ ఇప్పటికే నియోజకవర్గంలో మోహరించాయి.…
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా? ఆ పదవి ఏంటో.. సీఎం కేసీఆర్ ఆయనకు చెప్పేశారా? గులాబీ కండువా కప్పుకోగానే అధికారికంగా ప్రకటన చేసేస్తారా? టీఆర్ఎస్లో ఆయన చేరిక హుజురాబాద్ ఉపఎన్నిక కంటే ముందే ఉంటుందా.. లేదా? సీఎం కేసీఆర్తోపాటు అసెంబ్లీకి రావడంతో చర్చల్లోకి మోత్కుపల్లి..! బీజేపీకి దూరమైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. రేపోమాపో టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారని చర్చ జరిగినా.. తర్వాత…