వరంగల్ టీఆర్ఎస్లో కొత్త కుంపటి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్లో కొత్త కుంపటి రాజుకుందా? ఇప్పటికే మేయర్, ఎమ్మెల్యేల మధ్య దూరం పెరగ్గా.. ఇప్పుడు కార్పొరేటర్లతోనూ మేయర్కు పడటం లేదా? నగరబాట నగుబాటగా మారుతోందని సొంత పార్టీ నేతలే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా? గుండు సుధారాణి. ఈ మాజీ ఎంపీ.. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మేయర్. ఈ మధ్య నగరబాట కార్యక్రమాన్ని చేపట్టారు మేయర్. వెంటనే టీఆర్ఎస్కే చెందిన కార్పొరేటర్లు కయ్యిమన్నారు. మేయర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు నాయకులు. వరంగల్ అభివృద్ధిలో ఇప్పటికే ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్లడం లేదని మేయర్పై గులాబీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేటర్ల వంతు రావడంతో అధికారపార్టీలో కొత్త చర్చ మొదలైంది.
ఇప్పటికే ఎమ్మెల్యేలతో సఖ్యత అంతంతమాత్రం..!
గ్రేటర్ వరంగల్ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట, పరకాల, స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి మధ్య అస్సలు పొసగడం లేదు. మిగలిన ఎమ్మెల్యేలతోనూ అంతంతమాత్రంగానే సఖ్యత ఉందట. ఇలాంటి తరుణంలో కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పేరుతో మేయర్ నగరబాట.. నగుబాటు అవుతోందట.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
కార్పొరేటర్లు లేకుండానే మేయర్ నగరబాట..!
మేయర్ సుధారాణి డివిజన్లకు వస్తుంటే.. కార్పొరేటర్లు కనిపించడం లేదు. ఆమె వెంట కమిషనర్, ఇతర అధికారులే ఉంటున్నారు. ప్రజలు కూడా సమస్యలు చెప్పడానికి ముందుకు రావడం లేదట. 13 నుంచి 18 డివిజన్లలో నగరబాట నిర్వహించాల్సి ఉండగా.. మూడుచోట్లే మేయర్ పర్యటన సాగింది. ఎమ్మెల్యే రాని కారణంగా మరో మూడుచోట్ల నగరబాట వాయిదా పడింది. కేవలం అభివృద్ధి జరిగిన కాలనీల్లోనే మేయర్ పర్యటిస్తున్నారన్నది పార్టీ వర్గాల ఆరోపణ. సుధారాణి మేయర్గా బాధ్యతలు చేపట్టాక ఒంటరిగానే కాలనీల్లో పర్యటిస్తున్నారని కార్పొరేటర్ల ఆరోపణ. అభివృద్ధి పనులపైనా కార్పొరేటర్లతో చర్చించడం లేదనే విమర్శలున్నాయి.
మేయర్ తీరుపై ఎమ్మెల్యేలకు కార్పొరేటర్ల ఫిర్యాదు..!
మేయర్ సుధారాణి తీరుపై కొందరు కార్పొరేటర్లు తమ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారట. దీంతో తమ డివిజన్లలో నగరబాట జరగకుండా ఎమ్మెల్యేలు వాయిదా వేయించారని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు… కార్పొరేటర్లు ఒక అవగాహనకు వచ్చి కాలనీల్లో పర్యటిస్తున్నట్టు సమాచారం. ఇటీవల అధికారపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలు.. నిరసనల్లో నాయకుల మధ్య పొరపచ్చాలు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడా విభేదాలు.. క్షేత్రస్థాయి వరకు వ్యాపించడంతో శ్రేణుల్లో కలవరం మొదలైందట. మరి.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారో.. లేక పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు ముందుగానే చర్యలు చేపడతారో చూడాలి.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..