ఖమ్మం టీఆర్ఎస్లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఆ ఎమ్మెల్యేలకు పట్టు సడలిందా? ఎమ్మెల్యేల మాటలను వినే పరిస్థితి లేదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా.. ఆ నియోజకవర్గాల్లోని డొల్లతనం బయటపడిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు?
ఎమ్మెల్యేలకు లోకల్ లీడర్లపై పట్టు సడలిందా?
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు టీఆర్ఎస్ వర్గాల్లో కొనసాగుతున్నాయి. ఎవరికి వారుగా పోస్టుమార్టం చేస్తున్నారు. అందరి ఫోకస్ కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలపై ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే క్రాస్ ఓటింగ్ జరిగిందా లేక.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఎమ్మెల్యేలకు పట్టు సడలిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ మాట వినలేదా?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాగానే టీఆర్ఎస్లోని ఒక నేత క్రాస్ ఓటింగ్కు కారణమని ప్రచారం జరిగింది. ఇప్పటికీ కొందరికి ఆయనపైనే అనుమానాలు ఉన్నాయట. కానీ.. నిత్యం ఎమ్మెల్యేతో టచ్లో ఉన్న స్థానిక సంస్థల్లోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం రెవిన్యూ డివిజన్ల పరిధిలో క్రాస్ ఓటింగ్ జరిగిందన్నది అందరూ చెప్పే మాట. మధిరలో జడ్పీ ఛైర్మన్ కమల్రాజ్ ఉన్నప్పటికీ ఆయన మాట వినలేదు. వైరాలో క్రాస్ ఓటింగ్కు ఫలానా వారు కారణమని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్ స్పష్టంగా చెప్పినప్పటికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తాము చేయాల్సింది చేసేశారు.
కొత్తగూడెంలో వనమాకు సహకరించని స్థానిక నాయకులు?
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి గెలిచి.. టీఆర్ఎస్లోకి రావడంతో.. ఆయనకు స్థానిక నేతలు సహకరించడం లేదనే వాదన ఉంది. ఆ ప్రభావమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించిందని చెబుతున్నారు. పార్టీలోని కొందరు నాయకులకు కొత్తగూడెంలో బలమైన వర్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యేతో వారికి గ్యాప్ ఉంది. వనమాను ఇరకాటంలో పెట్టేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను వారు అనుకూలంగా మలుచుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
అశ్వరావుపేటలో ఎమ్మెల్యే మెచ్చాకు ఇంకా పట్టు చిక్కలేదు?
శల్య సారథ్యం చేసిన వాళ్లను గుర్తించారా?
అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీని వీటి ఈ మధ్యే టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు స్థానికంగా ఇంకా టీఆర్ఎస్పై పట్టు చిక్కలేదట. దానిని ప్రత్యర్థులు క్యాష్ చేసుకున్నారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మధిర, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేట నుంచే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారపార్టీ ఇప్పటికే గుర్తించిందని..శల్య సారథ్యం చేసిన సొంత పార్టీ నాయకులను పసిగట్టారని చెబుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ పూడ్చడం ఒక సమస్య అయితే.. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్లపై చర్యలు తీసుకోవడం ఇంకో సవాల్. మరి.. ఈ విషయాల్లో అధికారపార్టీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!