ఉలుకు పలుకు లేని ఆ ముగ్గురు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ముగ్గురు బీజేపీ నేతలు ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. అంతా ఒకే సామాజికవర్గం నేతలు కావడంతో పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయట. ఒకవైపు బీజేపీ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. పత్తా లేకుండా పోయిన వారి గురించి నిఘావర్గాలు ఆరా తీశాయట. ఇంతకీ ఎవరా నాయకులు?
పార్టీ ఆఫీస్కూ రావడం లేదని ఆరా..?
తెలంగాణలో బీజేపీ నాయకులు వరసగా ఆందోళనలు నిర్వహిస్తూ రోడ్లపైనే ఉంటున్నారు. జాగరణ దీక్ష చేపట్టిన పార్టీ చీఫ్ బండి సంజయ్ను అరెస్ట్ చేయడంతో పార్టీలో యాక్టివిటీస్ ఇంకా పెరిగాయి. బీజేపీ ఆఫీస్కు ముఖ్య నాయకుల తాడికి ఎక్కువైంది. ఇంత సందడిలోనూ కొందరు బీజేపీ సీనియర్ నాయకులు పార్టీ ఆఫీస్లో కనిపించడం లేదట. గతంలో పార్టీ కార్యాలయాన్నే అంటిపెట్టుకుని ఉన్న ఆ నాయకులు ఎందుకు రావడం లేదని కమలనాథులు ఆరా తీస్తున్నారట.
Also Read
మధ్యప్రదేశ్ సీఎం వచ్చినా పత్తా లేని మురళీధర్రావు
ఆ ముగ్గురు ఎవరో కాదు. ఒకప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. సంఘ్ పరివార్ క్షేత్రాల్లో కీలకంగా ఉన్న మురళీధర్రావు ఆ ముగ్గురిలో ఒకరు. మురళీధర్రావు ప్రస్తుతం మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్. బండి సంజయ్ అరెస్ట్పై ఒక ట్వీట్ చేశారు తప్ప ఉలుకు పలుకు లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తే ఆయన కనిపించలేదు. చివరకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చినా.. పత్తా లేరు. దీంతో మురళీధర్రావు ఎక్కడా అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. కాషాయ శిబిరంలో గుసగుసలు పెరిగాయి. వ్యక్తిగత పనులు, ఆరోగ్య కారణాల వల్ల అందుబాటులో లేరని పార్టీలో కొందరు చెబుతున్నా.. మిగతా వాళ్లకు ఆ సమాధానం అంతగా ఎక్కడం లేదట. దాల్ మే కుచ్ కాలా హై అన్నది వారి అనుమానం.
లింగోజీగూడ ఎపిసోడ్తో సంజయ్తో శేఖర్రావుకు గ్యాప్..!
మరో నాయకుడు పేరాల శేఖర్రావు గురించి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఖాదీ గ్రామీణ బోర్డు డైరెక్టర్గా ఉన్నారు శేఖర్. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు. మొన్నటి వరకు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు కూడా. ఏబీవీపీ, బీజేపీలో కొన్నేళ్లు పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసిన శేఖర్.. ఈ మధ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. GHMC పరిధిలోని లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలు పార్టీలో దుమారం రేపాయి. ఆ తర్వాత పార్టీ చీఫ్ బండి సంజయ్తో శేఖర్కు గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ దూకుడుగా వెళ్తున్న టైమ్లో శేఖర్ కనిపించడం లేదన్నది బీజేపీ వర్గాల మాట.
సంజయ్ అరెస్ట్పై స్పందన లేని కృష్ణసాగర్రావు..?
మూడో నాయకుడు.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు. తెలంగాణలో ఏం జరిగినా స్పందించి మీడియాలో కనిపించే ఆయన.. ప్రస్తుతం చప్పుడు చేయడం లేదు. పార్టీ కార్యాలయానికి రెగ్యులర్గా వచ్చేవారు. ప్రస్తుతం అదీ బంద్. మీడియాతో ముచ్చట్లు లేవు.. ముఖ్య నేతలు వస్తే మాటలు కలపడం లేదు. బండి సంజయ్ అరెస్ట్ అంశంలోనూ స్పందించలేదని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.
ముగ్గురు నేతల మౌనంపై పార్టీలోనే సందేహాలు..!
మురళీధర్రావు, శేఖర్రావు, కృష్ణసాగర్రావు ముగ్గురూ ఒకే సామాజికవర్గం. ఎందుకు సైలెంట్ అయ్యారన్నదానిపై కాషాయ శిబిరంలోనే అనేక సందేహాలు ఉన్నాయట. ఇదే సమయంలో రాష్ట్ర నిఘా వర్గాలు కూడా వీరి గురించి ఆరా తీస్తున్నారని బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. మరి.. ఈ మౌనానికి అసలు కారణం ఏంటో ఆ ముగ్గురు పార్టీ పెద్దలకైనా చెబుతారో లేదో..?
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!