Off The Record: మేడ్చల్ లో దేత్తడి .. హైకమాండ్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం రేపిన మేడ్చల్ బీఆర్ఎస్ ఎపిసోడ్పై హైకమాండ్ పోస్టుమార్టం మొదలుపెట్టిందా? మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో అసలు ఒప్పందం ఏంటి? పార్టీపై తొలిసారి బహిరంగంగా ఎమ్మెల్యేలు మాట్లాడటం వెనక ఏం జరిగింది ? సంబంధంలేని ఎమ్మెల్యేలు సమావేశానికి రావడం వెనక ఎవరి ప్రోద్బలం ఉంది?
తొలి ఏడాది కుత్బుల్లాపూర్కు మార్కెట్ పదవి
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్లో రేగిన రగడపై అధికార పార్టీలో ఇంకా చర్చ సాగుతూనే ఉంది. మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల విమర్శల వెనక ఏం జరిగిందని ఆరా తీస్తూనే ఉన్నారు. సమస్యకు కారణమైన అంశాలపై ఫోకస్ పెట్టారు నేతలు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా రవీందర్ యాదవ్ను సరిగ్గా ఏడాది క్రితం నియమించారు. కుత్బుల్లాపూర్-మేడ్చల్ నేతల మధ్య ఇదీ ఒప్పందం. తొలి ఏడాది కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నేతకు ఇవ్వాలనేది అంగీకారం. అందులో భాగంగా కుత్బుల్లాపూర్కు చెందిన రవీందర్ యాదవ్కు ఇచ్చారు. ఏడాది తర్వాత మేడ్చల్ జిల్లాకు ఆ పదవి ఇవ్వాలనేది ఒప్పందంలో ఉంది. ఏడాది ముగిసిన వెంటనే ఒప్పందాన్ని నేతల ఉల్లంఘించారు. మళ్లీ ఆ పదవీని మాకే ఇవ్వాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పట్టుపట్టారు.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
ఒప్పందం ప్రకారం వెళ్లాలన్న అధిష్ఠానం..!
అధిష్టానం పెద్దల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు. ఒప్పందం ప్రకారం నడచుకోవాలని సంకేతాలు వచ్చాయి. మేడ్చల్ జిల్లాకు చెందిన భాస్కర్ యాదవ్కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించింది. జీవో విడదలైంది. ఆలస్యం మంచిదికాదని మరుసటి రోజే భాస్కర్ ప్రమాణం కూడా చేసేశారు. ఇదే మైనంపల్లి ఇంట్లో జిల్లా ఎమ్మెల్యేల సంచలన సమావేశానికి కారణం అయింది.
అగ్నికి ఆజ్యం పోసిన మైనంపల్లి ఇంట్లో భేటీ..!
మేడ్చల్ మార్కెట్ యార్డు కుత్బుల్లాపూర్ -మేడ్చల్ మధ్య ఉంటుంది. ఎనభై శాతం మేడ్చల్ జిల్లాకే ఈ మార్కెట్తో సంబంధం ఉంటుంది. దాదాపు 30 ఏళ్లలో కుత్చుల్లాపూర్కు చెందిన వ్యక్తికి తొలిసారి ఆ పదవి ఇచ్చారు. మెజార్టీ మేడ్చల్లో ఉండటంతో కుత్బుల్లాపూర్ నేతలు ఈ విషయాన్ని పెద్దగా ఎప్పుడూ పట్టంచుకోలేదు. మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డితో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ సఖ్యతగానే ఉండేవారు. మైనంపల్లి ఇంట్లో సమావేశం కావాలని నిర్ణయంచడం… వివేక్ మిగిలిన ఎమ్మెల్యేలను సమావేశానికి కూడగట్టడం… అగ్నికి ఆజ్యం పోసింది. ఈ మార్కెట్తో సంబంధంలేని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుబాష్ లాంటి వాళ్లు కూడా ఆ రహస్య సమావేశానికి రావడంతో ఏదో కుట్ర ఉందని అధిష్ఠానం నమ్ముతోంది. అంతర్గత సమావేశం జరిగినా.. పార్టీ అధిష్టానంపై నేరుగా విమర్శలు చేయడాన్ని సీరియస్గా తీసుకున్నారు పెద్దలు.
లైబ్రరీ పదవిపైనా వివేక్, శంభీపూర్ రాజు మధ్య రగడ
ఇక కుత్బుల్లాపూర్లో పదవుల పంచాయతీ కొత్తకాదు. జిల్లా లైబ్రరీ చైర్మన్గా ఉద్యమకారుడు నాగరాజుయాదవ్ను నియమించారు. రెండేళ్ల పదవీ కాలం ఉండగా ఏడాదిన్నరకే తీసేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు నాగరాజు అనుచరుడు. ఆ కారణంతోనే ఎమ్మెల్యే వివేక్ ఒత్తిడి చేసి తీసేశారనేది ఆరోపణ. కుత్బుల్లాపూర్ కు చెందిన నాగరాజు యాదవ్ స్థానంలో లైబ్రరీ చైర్మన్ గా మేడ్చల్ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఆ ఎపిసోడ్ కూడా ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న విభేదాలకు ప్రత్యక్ష సాక్షంగా చెబుతున్నారు నేతలు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!