దేశ రాజధాని ఢిల్లీలో BRS ఆఫీసు ప్రారంభించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్. అబ్కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదంతో పాగా వేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్ స్పేస్ ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ నజర్ ఉంది. ఆ విధంగా తెలుగు రాష్ట్రమైన ఏపీపైనా ఆరా తీస్తున్నారట. ఇప్పటికే BRS విస్తరణ దిశగా చర్యలూ మొదలైనట్టు తెలుస్తోంది. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు…
యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం కొసం ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మండలాలపై పట్టు సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే. అయితే ఆమె చర్యలు పార్టీ కేడర్లో అసంతృప్తికి కారణం అవుతున్నాయట. చాలాకాలంగా ఎమ్మెల్యే సునీతా ఆమె భర్త నల్లగొండ DCCB ఛైర్మన్ మహేందర్ రెడ్డిలు మండలాల వారీగా సీనియర్లను కాదని మరికొందరిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారపార్టీలో మొదటి నుంచి ఉన్న…
అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కావాలని చేసుకుంటున్నారో లేక అనుకోకుండా జరుగుతోందో కానీ.. సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో రాప్తాడులో జరుగుతున్న సంఘటనలు పీక్ స్టేజ్ కి వెళ్తున్నాయి. గతంలో పరిటాల కుటుంబంపై సుధీర్ఘ పోరాటం తరువాత 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి విజయం దక్కింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తర్వాత ఆయనకు అన్నీ సమస్యలే. అధికారం లేనప్పుడు నాయకులకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే…
ఎమ్మెల్యే రేగా కాంతారావు.. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇద్దరిదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గమే అడ్డా. అధికారపార్టీలో ఇద్దరూ వలస నాయకులే. 2018 ఎన్నికల్లో పినపాకలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత కారు ఎక్కేశారు రేగా కాంతారావు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పాయం వెంకటేశ్వర్లు. అంతకుముందు జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకొన్నారు పాయం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు.…
దేశవ్యాప్తంగా BRS కార్యకలాపాలు ప్రారంభించే దిశగా గులాబీ శిబిరంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యాలయం సిద్ధమైంది. ఇక జరగాల్సిన మరో ముచ్చట.. పార్టీకి కొత్త కమిటీల ప్రకటన. ఆ పనిలోనే ఉన్నారు గులాబీ దళపతి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్టుగానే పార్టీ కమిటీని వేసే పనిలో ఉన్నారు. ఆ ఫ్రేమ్లో పట్టేవారికే బీఆర్ఎస్ పదవులు కట్టబెడతారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో BRS విస్తరించేందుకు…
ఆంధ్రప్రదేశ్లో పెద్ద సబ్ రీజియన్స్లో ఒకటి ఉత్తరాంధ్ర. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కలిపి మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంత ఓటర్ల తీర్పు ఏకపక్షమైన ప్రతీసారీ పార్టీలు అనూహ్యమైన విజయాలను కైవశం చేసుకుంటున్నాయి. 1994 ఎన్నికల్లో తొలిసారి ఉమ్మడి అభ్యర్థులతో కలిపి 33స్థానాలను గెల్చుకుంది టీడీపీ. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఒక్కరే ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2019లో వైసీపీ గాలి వీచింది. 28 చోట్ల గెలిచి…
ఒకప్పుడు ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్టీని ఇబ్బందుల్లో పడేశాయ్. ఇది తట్టుకోలేని ఆ నేత పార్టీలోంచి జంప్ అయ్యారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఐతే…గతంలో విభేదించిన నేతతోనే మళ్లీ పని చేయాల్సి రావటం ఆయనకు మింగుడుపడటం లేదు. ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చేందుకు ఏకంగా అధినేత జోక్యం చేసుకోవాల్సింది. ఇంతకీ…ఆ ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదిరినట్లేనా? తిరిగి పార్టీలోకి వచ్చినా…రవీందర్ సింగ్ సొంతంగానే కార్యక్రమాలు కరీంనగర్ జిల్లా బిఆర్యస్లో…