Axar Patel: అక్షర్ పటేల్ను అందరూ ‘బాపు’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అసలు రహస్యం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axar Patel Bapu Nickname: టీ20 వరల్డ్ కప్పులో భారత్ ఘన విజయం సాధించింది. మూడోసారి కప్పును కైవసం చేసుకుంది. అయితే, సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో పోరుకు అక్షర్ పటేల్ను పక్కన పెట్టడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అతడు భారత జట్టుకు వైస్ కెప్టెన్గానూ ఉన్నాడు. ఆ మ్యాచ్లో టీమ్ఇండియా ఓడిపోయింది. ఇక ఫైనల్లో అక్షర్ ఇరగదీశాడు. ఇప్పుడే కాదు.. 2024 టీ20 ప్రపంచకప్లోనూ అక్షర్ అద్భుతంగా రాణించాడు. ఇవి పక్కన పెడితే సోషల్ మీడియాలో అందరూ అక్షర్ను “బాపు” అని పిలుస్తారు. ఇంతకీ బాపు అనే పేరు అక్షర్ పటెల్కు ఎందుకు వచ్చింది? అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
అక్షర్ గాంధీజీ సొంత రాష్ట్రానికి చెందిన వాడు కావడంతో అక్షర్ను అంతా ప్రేమగా ‘బాపు’ అని పిలుచుకుంటారు. అక్షర్ పటేల్ గుజరాత్లోని ఖేడా జిల్లాకు చెందినవాడు. భారత క్రికెటర్ అక్షర్ పటేల్ 1994 జనవరి 20న జన్మించాడు. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఉన్న నడియాడ్ (Nadiad) అనే నగరంలో పుట్టాడు. ఇక గాంధీ విషయానికి వస్తే.. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన గాంధీని ‘బాపూజీ’గా పిలుస్తారు. ఈ బాపు పేరు అక్షర్కు వచ్చింది. ఇక అక్షర్పై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, వీడియోలు, మీమ్స్ గురించి పెద్దగా చెప్పనరవసం లేదు. అక్షర్ బాగా రాణిస్తే చాలు ఇక బాపు.. బాపు అంటూ పొగిడేస్తుంటారు.
READ MORE: Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!
ఇదిలా ఉండగా.. 2024లో జరిగిన వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను 68 పరుగుల తేడాతో మట్టికరిపించి భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాటర్ల పాత్ర ఉన్నప్పటికీ, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఒకే ఒక పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. గుజరాత్ బాపు అక్షర్ పటెల్. “ఈ బాపు అహింసను నమ్మడు, ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టడంలో అస్సలు కనికరం చూపడు. బాపు.. నీ బౌలింగ్ ప్రత్యర్థుల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు!” అంటూ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!