Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Kondapi Ysrcp Leaders Politics

Off The Record: కొండపి నేతల కుప్పిగంతులు

Published Date :January 21, 2023 , 8:29 pm
By NTV WebDesk
Off The Record: కొండపి నేతల కుప్పిగంతులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్టీ పెద్దలతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తుంటారు అధికారపార్టీ నాయకులు. కాకితో కబురంపినా రెక్కలు కట్టుకుని వాలిపోతారు. అలాంటి ఛాన్స్‌ దక్కినా.. గ్రూపులతో రచ్చ చేస్తున్న ఆ నియోజకవర్గ నేతలు మరోలా ప్రవర్తించారు. ఓసారి.. ఓ వర్గమే రావడంతో మీటింగ్‌ను మరో రోజుకు వాయిదా వేశారు. మరో డేట్‌ ఫిక్స్‌ చేస్తే ఈసారి రెండో వర్గం డుమ్మా కొట్టింది. ఇంకేముందీ అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. హైకమాండ్‌ను ధిక్కరించిన నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రచారం జరుగుతోంది.

అధిష్ఠానం పిలిచినా మీటింగ్‌కు వెళ్లకుండా గేమ్‌ ఆడారా?
పార్టీ అధిష్ఠానం పిలిచినా సమీక్షకు హాజరుకాకుండా గేమ్‌ ఆడింది ఎవరో కాదు.. ప్రకాశం జిల్లా కొండెపి వైసీపీ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలన్నది వైసీపీ పెద్దల ఆలోచన. కానీ.. ఆ ఆలోచనకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు ఇక్కడి పార్టీ నేతలు. గత ఎన్నికల్లో ఓడిన వైసీపీ మాజీ ఇంఛార్జ్‌ మాదాసి వెంకయ్యకు.. ప్రస్తుతం పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్‌బాబుకు అస్సలు పడటం లేదు. ఈ సమస్యను సెట్ చేయాలని అనుకున్నారు పార్టీ పెద్దలు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో తాడేపల్లి రావాలని కొండెపి వైసీపీ నేతలను పార్టీ పెద్దలు తాడేపల్లికి పిలిచారు. సాక్షాత్తూ పార్టీ అధినేత, సీఎం జగన్‌ సమీక్ష చేస్తారని చెప్పారట. కానీ.. రెండు వర్గాలు అధిష్ఠానంతోనే గేమ్‌ ఆడే ప్రయత్నం చేశాయట. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నవంబర్‌ 22 మీటింగ్‌కు వెళ్లని వెంకయ్య వర్గం?
మొదట గత ఏడాది నవంబర్‌ 22న తాడేపల్లి రావాలని కొండెపి వైసీపీ ముఖ్య నేతలకు సమాచారం వెళ్లింది. ఆ మీటింగ్‌కు మాజీ ఇంఛార్జ్‌ మాదాసి వెంకయ్య వర్గీయులు వెళ్లలేదు. అశోక్‌బాబును ఇంఛార్జ్‌గా కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాలేదని పార్టీ పెద్దలకు చెప్పారట. దాంతో జనవరి 19న రెండో మీటింగ్‌కు షెడ్యూల్‌ చేశారు. అంతా తాడేపల్లి రావాలని స్పష్టం చేశారట. అయితే రెండో మీటింగ్‌కు ప్రస్తుత ఇంఛార్జ్‌ అశోక్‌బాబు వర్గం డుమ్మా కొట్టేసింది. దీంతో చేసేది లేక రెండో మీటింగూ వాయిదా పడింది. పోయినసారి మీటింగ్‌కు మాదాసి వర్గం రాకపోవడంతో.. టిట్‌ ఫర్‌ టాట్‌లా ఉండాలని అశోక్‌బాబు వర్గం రెండో సమావేశానికి వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. ఇలా రెండు వర్గాలు గేమ్‌ ఆడటంతో వైసీపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.

కొండెపి వైసీపీలో మూడున్నరేళ్లుగా కుంపటి
గత ఎన్నికల్లో అశోక్‌బాబు వైసీపీ టికెట్‌ ఆశించారు. కానీ మాదాసి వెంకయ్యకు పార్టీ ఛాన్స్‌ ఇచ్చింది. దాంతో అశోక్‌బాబు వర్గం ఎన్నికల్లో వెంకయ్యకు సహకరించలేదని చెవులు కొరుక్కుంటోంది. వెంకయ్య ఓడినా.. ఆయన్ను డీసీసీబీ ఛైర్మన్‌ను చేసింది అధిష్ఠానం. అశోక్‌బాబుకు తిరిగి కొండెపి వైసీపీ పగ్గాలు అప్పగించింది. పార్టీ అధికారంలో ఉన్నా.. ఇద్దరూ కలిసి సాగడం లేదు. ఎవరి గ్రూపు వాళ్లదే. గత మూడున్నరేళ్లుగా ఇదే తంతు. రెండు వర్గాలను కూర్చోబెట్టి సర్దుబాటు చేయాలనుకునుకున్నారు అధినేత జగన్‌. దానికోసమే రెండుసార్లు మీటింగ్స్‌ ఏర్పాటు చేస్తే… ఓ సారి ఓ వర్గం.. మరోసారి మరో వర్గం డుమ్మా కొట్టాయి.

తీరు మార్చుకోకపోతే చర్యలేనని అధిష్ఠానం వార్నింగ్‌?
రెండుసార్లు సమీక్ష వాయిదా పడటంతో..ఈ నిర్లక్ష్యానికి కొండెపి వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రచారం జరుగుతోంది. ఇరువర్గాలు సమన్వయం చేసుకుని మరోసారి సమీక్షకు రావాలని ఆదేశాలిచ్చారట. తీరు మార్చుకోకపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ముచ్చటగా మూడోసారి నిర్వహించే సమావేశానికి రెండు వర్గాలు వెళ్తాయో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది. వచ్చే మీటింగ్‌లో గట్టిగానే అక్షింతలు పడతాయని.. కొండెపి వైసీపీలో హాట్ హాట్‌ డిస్కషన్‌ జరుగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap
  • kondapi
  • off the record
  • YSRCP

తాజావార్తలు

  • Tollywood February Box Office Report : ఫిబ్రవరిలో పరాజయాల పరంపర.. ఆదుకోని శ్రీ విష్ణు..

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions