Off The Record: కొండపి నేతల కుప్పిగంతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ పెద్దలతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తుంటారు అధికారపార్టీ నాయకులు. కాకితో కబురంపినా రెక్కలు కట్టుకుని వాలిపోతారు. అలాంటి ఛాన్స్ దక్కినా.. గ్రూపులతో రచ్చ చేస్తున్న ఆ నియోజకవర్గ నేతలు మరోలా ప్రవర్తించారు. ఓసారి.. ఓ వర్గమే రావడంతో మీటింగ్ను మరో రోజుకు వాయిదా వేశారు. మరో డేట్ ఫిక్స్ చేస్తే ఈసారి రెండో వర్గం డుమ్మా కొట్టింది. ఇంకేముందీ అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. హైకమాండ్ను ధిక్కరించిన నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రచారం జరుగుతోంది.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
అధిష్ఠానం పిలిచినా మీటింగ్కు వెళ్లకుండా గేమ్ ఆడారా?
పార్టీ అధిష్ఠానం పిలిచినా సమీక్షకు హాజరుకాకుండా గేమ్ ఆడింది ఎవరో కాదు.. ప్రకాశం జిల్లా కొండెపి వైసీపీ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలన్నది వైసీపీ పెద్దల ఆలోచన. కానీ.. ఆ ఆలోచనకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు ఇక్కడి పార్టీ నేతలు. గత ఎన్నికల్లో ఓడిన వైసీపీ మాజీ ఇంఛార్జ్ మాదాసి వెంకయ్యకు.. ప్రస్తుతం పార్టీ ఇంఛార్జ్గా ఉన్న వరికూటి అశోక్బాబుకు అస్సలు పడటం లేదు. ఈ సమస్యను సెట్ చేయాలని అనుకున్నారు పార్టీ పెద్దలు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో తాడేపల్లి రావాలని కొండెపి వైసీపీ నేతలను పార్టీ పెద్దలు తాడేపల్లికి పిలిచారు. సాక్షాత్తూ పార్టీ అధినేత, సీఎం జగన్ సమీక్ష చేస్తారని చెప్పారట. కానీ.. రెండు వర్గాలు అధిష్ఠానంతోనే గేమ్ ఆడే ప్రయత్నం చేశాయట. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
నవంబర్ 22 మీటింగ్కు వెళ్లని వెంకయ్య వర్గం?
మొదట గత ఏడాది నవంబర్ 22న తాడేపల్లి రావాలని కొండెపి వైసీపీ ముఖ్య నేతలకు సమాచారం వెళ్లింది. ఆ మీటింగ్కు మాజీ ఇంఛార్జ్ మాదాసి వెంకయ్య వర్గీయులు వెళ్లలేదు. అశోక్బాబును ఇంఛార్జ్గా కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాలేదని పార్టీ పెద్దలకు చెప్పారట. దాంతో జనవరి 19న రెండో మీటింగ్కు షెడ్యూల్ చేశారు. అంతా తాడేపల్లి రావాలని స్పష్టం చేశారట. అయితే రెండో మీటింగ్కు ప్రస్తుత ఇంఛార్జ్ అశోక్బాబు వర్గం డుమ్మా కొట్టేసింది. దీంతో చేసేది లేక రెండో మీటింగూ వాయిదా పడింది. పోయినసారి మీటింగ్కు మాదాసి వర్గం రాకపోవడంతో.. టిట్ ఫర్ టాట్లా ఉండాలని అశోక్బాబు వర్గం రెండో సమావేశానికి వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. ఇలా రెండు వర్గాలు గేమ్ ఆడటంతో వైసీపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.
కొండెపి వైసీపీలో మూడున్నరేళ్లుగా కుంపటి
గత ఎన్నికల్లో అశోక్బాబు వైసీపీ టికెట్ ఆశించారు. కానీ మాదాసి వెంకయ్యకు పార్టీ ఛాన్స్ ఇచ్చింది. దాంతో అశోక్బాబు వర్గం ఎన్నికల్లో వెంకయ్యకు సహకరించలేదని చెవులు కొరుక్కుంటోంది. వెంకయ్య ఓడినా.. ఆయన్ను డీసీసీబీ ఛైర్మన్ను చేసింది అధిష్ఠానం. అశోక్బాబుకు తిరిగి కొండెపి వైసీపీ పగ్గాలు అప్పగించింది. పార్టీ అధికారంలో ఉన్నా.. ఇద్దరూ కలిసి సాగడం లేదు. ఎవరి గ్రూపు వాళ్లదే. గత మూడున్నరేళ్లుగా ఇదే తంతు. రెండు వర్గాలను కూర్చోబెట్టి సర్దుబాటు చేయాలనుకునుకున్నారు అధినేత జగన్. దానికోసమే రెండుసార్లు మీటింగ్స్ ఏర్పాటు చేస్తే… ఓ సారి ఓ వర్గం.. మరోసారి మరో వర్గం డుమ్మా కొట్టాయి.
తీరు మార్చుకోకపోతే చర్యలేనని అధిష్ఠానం వార్నింగ్?
రెండుసార్లు సమీక్ష వాయిదా పడటంతో..ఈ నిర్లక్ష్యానికి కొండెపి వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రచారం జరుగుతోంది. ఇరువర్గాలు సమన్వయం చేసుకుని మరోసారి సమీక్షకు రావాలని ఆదేశాలిచ్చారట. తీరు మార్చుకోకపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ముచ్చటగా మూడోసారి నిర్వహించే సమావేశానికి రెండు వర్గాలు వెళ్తాయో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది. వచ్చే మీటింగ్లో గట్టిగానే అక్షింతలు పడతాయని.. కొండెపి వైసీపీలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది.
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!