US Big Bounty: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ వేటాడుతున్నాయి. ఇప్పటికే, తొలి రోజు దాడిలోనే మాజీ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. ఇప్పుడు, కొత్తగా ఎన్నికైన మోజ్తబాను టార్గెట్ చేస్తున్నారు. మోజ్తబాతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన ఇతర సీనియర్ అధికారులను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు.
Read Also: Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!
ఇదిలా ఉంటే, వీరి ఆచూకీ తెలిపిన వారికి అమెరికా బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇరాన్ కీలక నేతల సమాచారం ఇచ్చిన వారికి అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 92.47 కోట్లు) రివార్డును ప్రకటించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ‘‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’’ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రకటన వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్న IRGC నాయకులను పట్టుకోవాలని యూఎస్ ప్లాన్ చేస్తోంది. ఇరాన్ ప్రజలు ఈ సమాచారం ఇస్తే వారికి బహుమతితో పాటు అమెరికాలో స్థిరపడేందుకు అవకాశం ఇస్తామని చెప్పింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజాని వంటి కీలక నేతల్ని అమెరికా కోరుతోంది. మరోవైపు, ఇజ్రాయిల్ అమెరికాలు ఇరాన్పై దాడుల్ని తీవ్రం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్ లోని టార్గెట్లపై భీకర దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ కూడా తన ప్రతీకార దాడుల్ని పెంచింది. ముఖ్యంగా, గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్ దేశాలను టార్గెట్ చేస్తోంది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతోంది.