కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా సామాన్యుల జీవన ప్రమాణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సుల్లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు.. వచ్చే ఐదేళ్లలో భారత్లో తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. బెంగళూరులో నిర్మలా సీతారామన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొద్ది రోజులకే ఉపశమనం లభించింది. పోల్ బాండ్ల కేసులో నిర్మలా సీతారామన్పై విచారణకు కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. నిర్మలా సీతారామన్, ఇతర బీజేపీ అగ్ర నేతలపై తదుపరి విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారం నిలిపివేసింది.
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్నగర పీఎస్ పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
NPS Vatsalya Yojana: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న ఎన్పిఎస్ వాత్సల్య యోజనను ప్రారంభించనున్నారు. దీనిని 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. దేశంలోని పిల్లలందరికీ బలమైన ఆర్థిక పునాదిని అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రితో పాటు పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎన్పీఎస్ వాత్సల్యలో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు పథకం గురించిన సమాచారాన్ని అందించే పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నారు.…
Tamil Nadu CM: కేంద్ర ఆర్థిక మంత్రికి క్షమాపణలు చెప్పిన జీఎస్టీ గురించి ప్రశ్రలు అడిగిన రెస్టారెంట్ యజమాని చెప్పిన వీడియో వైరల్ కావడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తుంది.
Banking Liquidity: ఆగస్టు నెలలో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ గణనీయంగా తగ్గి పోయిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో (ఆగస్టు 2న) బ్యాంకింగ్ లిక్విడిటీ 2. 86 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఆగస్టు 16వ తేదీ నాటికి 1.55 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది.
2024-25 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం రూ.48.21 లక్షల కోట్ల బడ్జెట్ను మంగళవారం లోక్సభ ఆమోదించింది. దిగువ సభ కూడా మూజువాణి ఓటు ద్వారా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ను ఆమోదించింది. వీటికి సంబంధించిన విభజన బిల్లును కూడా సభ ఆమోదించింది. బడ్జెట్ చర్చకు సమాధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 2024-25 మధ్యకాలంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.9 శాతానికి, 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.…
నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మైక్ కట్ చేశారన్న ఆరోపణలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. సమావేశంలో మాట్లాడేందుకు అందరికీ నిర్ణీత సమయాన్ని కేటాయించినట్లు ఆమె తెలిపారు.