Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో “అతిపెద్ద”, “అతిచిన్న” బడ్జెట్ ప్రసంగాలు ఇవే..
- నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్పై అందరిలో ఆసక్తి..
- అతిపెద్ద బడ్జెట్ స్పీచ్ నిర్మలమ్మదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్పై దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇండియాని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లే అనేక నిర్ణయాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిర్మలమ్మ చేయబోయే బడ్జెట్ ప్రసంగం గురించి అంతా ఎదురుచూస్తు్న్నారు. శనివారం, ఆమె వరసగా 8వ సారి కేంద్ర బడ్జెన్ని ప్రవేశపెట్టబోతున్నారు.
భారత బడ్జెట్ చరిత్రలో అతిపెద్ద, అతిచిన్న బడ్జెట్ ప్రసంగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
అతిపెద్ద బడ్జెట్ ప్రసంగాలు:
నిర్మల సీతారామన్: 2020 బడ్జెట్ ప్రదర్శన సమయంలో, ఆర్థిక మంత్రి సీతారామన్ మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, భారత చరిత్రలో అతి సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2020-21 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగింది. 2019 బడ్జెట్ సందర్భంగా ఆమె చేసిన 2 గంటల 19 నిమిషాల బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు. 2020లో ఆమె సొంత రికార్డుని ఆమె బద్దలు కొట్టారు.
జస్వంత్ సింగ్: నిర్మలా సీతారామన్ ముందు అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ జస్వంత్ సింగ్ పేరిట ఉండేది. ఆయన 2023లో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. 2014లో అరుణ్ జైట్లీ 2 గంటల 10 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.
Read Also: UK: బ్రిటన్ “ఇస్లామిక్ దేశం”గా మారొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
అతి చిన్న బడ్జెట్ ప్రసంగాలు:
హిరుభాయ్ ఎం. పటేల్: భారతదేశ బడ్జెట్ చరిత్రలో అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం. పటేల్ చేసిన ప్రసంగం నిలిచిపోతుంది. ఆయన ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతో తయారు చేశారు.
పదాల పరంగా చూస్తే 1991లో అప్పటి ఆర్థిక మంత్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్దే. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్ తెరిచిన ఈ కీలక బడ్జెట్ ప్రసంగంలో 18,600 పదాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రపంచీకరణ వైపు తీసుకెళ్లింది. పీవీ నరసింహరావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ 1991-96 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?