Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో “అతిపెద్ద”, “అతిచిన్న” బడ్జెట్ ప్రసంగాలు ఇవే..
- నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్పై అందరిలో ఆసక్తి..
- అతిపెద్ద బడ్జెట్ స్పీచ్ నిర్మలమ్మదే..
Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్పై దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇండియాని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లే అనేక నిర్ణయాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిర్మలమ్మ చేయబోయే బడ్జెట్ ప్రసంగం గురించి అంతా ఎదురుచూస్తు్న్నారు. శనివారం, ఆమె వరసగా 8వ సారి కేంద్ర బడ్జెన్ని ప్రవేశపెట్టబోతున్నారు.
భారత బడ్జెట్ చరిత్రలో అతిపెద్ద, అతిచిన్న బడ్జెట్ ప్రసంగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
అతిపెద్ద బడ్జెట్ ప్రసంగాలు:
నిర్మల సీతారామన్: 2020 బడ్జెట్ ప్రదర్శన సమయంలో, ఆర్థిక మంత్రి సీతారామన్ మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, భారత చరిత్రలో అతి సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2020-21 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగింది. 2019 బడ్జెట్ సందర్భంగా ఆమె చేసిన 2 గంటల 19 నిమిషాల బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు. 2020లో ఆమె సొంత రికార్డుని ఆమె బద్దలు కొట్టారు.
జస్వంత్ సింగ్: నిర్మలా సీతారామన్ ముందు అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ జస్వంత్ సింగ్ పేరిట ఉండేది. ఆయన 2023లో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. 2014లో అరుణ్ జైట్లీ 2 గంటల 10 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.
Read Also: UK: బ్రిటన్ “ఇస్లామిక్ దేశం”గా మారొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
అతి చిన్న బడ్జెట్ ప్రసంగాలు:
హిరుభాయ్ ఎం. పటేల్: భారతదేశ బడ్జెట్ చరిత్రలో అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం. పటేల్ చేసిన ప్రసంగం నిలిచిపోతుంది. ఆయన ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతో తయారు చేశారు.
పదాల పరంగా చూస్తే 1991లో అప్పటి ఆర్థిక మంత్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్దే. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్ తెరిచిన ఈ కీలక బడ్జెట్ ప్రసంగంలో 18,600 పదాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రపంచీకరణ వైపు తీసుకెళ్లింది. పీవీ నరసింహరావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ 1991-96 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!