Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో “అతిపెద్ద”, “అతిచిన్న” బడ్జెట్ ప్రసంగాలు ఇవే..
- నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్పై అందరిలో ఆసక్తి..
- అతిపెద్ద బడ్జెట్ స్పీచ్ నిర్మలమ్మదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్పై దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇండియాని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లే అనేక నిర్ణయాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిర్మలమ్మ చేయబోయే బడ్జెట్ ప్రసంగం గురించి అంతా ఎదురుచూస్తు్న్నారు. శనివారం, ఆమె వరసగా 8వ సారి కేంద్ర బడ్జెన్ని ప్రవేశపెట్టబోతున్నారు.
భారత బడ్జెట్ చరిత్రలో అతిపెద్ద, అతిచిన్న బడ్జెట్ ప్రసంగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
అతిపెద్ద బడ్జెట్ ప్రసంగాలు:
నిర్మల సీతారామన్: 2020 బడ్జెట్ ప్రదర్శన సమయంలో, ఆర్థిక మంత్రి సీతారామన్ మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, భారత చరిత్రలో అతి సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2020-21 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగింది. 2019 బడ్జెట్ సందర్భంగా ఆమె చేసిన 2 గంటల 19 నిమిషాల బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు. 2020లో ఆమె సొంత రికార్డుని ఆమె బద్దలు కొట్టారు.
జస్వంత్ సింగ్: నిర్మలా సీతారామన్ ముందు అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ జస్వంత్ సింగ్ పేరిట ఉండేది. ఆయన 2023లో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. 2014లో అరుణ్ జైట్లీ 2 గంటల 10 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.
Read Also: UK: బ్రిటన్ “ఇస్లామిక్ దేశం”గా మారొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
అతి చిన్న బడ్జెట్ ప్రసంగాలు:
హిరుభాయ్ ఎం. పటేల్: భారతదేశ బడ్జెట్ చరిత్రలో అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం. పటేల్ చేసిన ప్రసంగం నిలిచిపోతుంది. ఆయన ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతో తయారు చేశారు.
పదాల పరంగా చూస్తే 1991లో అప్పటి ఆర్థిక మంత్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్దే. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్ తెరిచిన ఈ కీలక బడ్జెట్ ప్రసంగంలో 18,600 పదాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రపంచీకరణ వైపు తీసుకెళ్లింది. పీవీ నరసింహరావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ 1991-96 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!