రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థులు ఈసారి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోలేరు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కోచింగ్ సెంటర్లు, విద్యార్థులకు కోటా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా కోచింగ్ ఏరియాలో లౌడ్ మ్యూజిక్ సిస్టమ్పై నిషేధం ఉంటుందని పోలీసులు తెలిపారు. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్లు, మెస్ల దగ్గర మద్యం, మత్తు పదార్థాలు సేవించరాదని చెప్పారు. కోటా సిటీ ఎస్పీ శరద్ చౌదరి కూడా ఈ ఉత్తర్వును కచ్చితంగా అమలు చేయాలని కోచింగ్…
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది.
విశ్వంలోని సుదూరాల నుంచి వచ్చే కాస్మిక్ ఎక్స్-తరంగాల ధ్రువణాలను అధ్యయనం చేయడానికి భారత్ తొలిసారిగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఇది అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ని అధ్యయనం చేస్తుంది. విశ్వంలో ఉన్న సమస్యాత్మక రహస్యాలను ఈ ప్రయోగం ద్వారా వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి, ప్రజలు తమ స్నేహితులతో కలిసి ప్రయాణించడానికి లేదా పార్టీ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆల్కహాల్ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలిసినప్పటికీ, చాలా మంది దానిని తమ వేడుకల్లో భాగం చేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ దాని వల్ల కలిగే హ్యాంగోవర్ మీ నూతన సంవత్సరాన్ని పాడు చేస్తుంది. హ్యాంగోవర్ను ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకోండి.
Delhi: నూతన సంవత్సర వేడుకలకు ముందు ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న సరిహద్దులు, ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
విశాఖలో రేపు, ఎల్లుండి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు అధికారులు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సహా పలు రహదారులు మూసివేయనున్నారు. 31 రాత్రి 8గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్ మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్ నుంచి వేపగుంట, పెందుర్తి జంక్షన్ నుంచి NAD జంక్షన్…
న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసులు సరికొత్త స్టెప్ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోని డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్ను రంగంలోకి దించింది నార్కోటిక్ టీం. రేపటి నుంచి పరీక్షలు చేయడానికి నార్కోటిక్ బ్యూరో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి.
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పదిరోజుల వ్యవధిలో ఫిలింనగర్ లో రెండోసారి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. అతన్ని బెంగళూరుకు చెందిన క్యాప్ డ్రైవర్ బాబు కిరణ్ గా గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారంతో పబ్ పార్కింగ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అధికారులు. మరోవైపు.. బాబు కిరణ్…
Today (09-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్కి ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమై అదే స్థాయిలో ముగిసింది. రెండు సూచీలు కూడా తమ బెంచ్ మార్క్లకు ఎగువన క్లోజ్ కావటం చెప్పుకోదగ్గ అంశం. ఈ రోజు ఫస్టాఫ్ ట్రేడింగ్లో గరిష్ట స్థాయిలో వచ్చిన లాభాలను సొమ్ము చేసుకునేందుకు ఇన్వెస్టర్లు పెద్దఎత్తున స్టాక్స్ అమ్మకాలకు దిగటంతో సెకండాఫ్లో మార్కెట్ ఊగిసలాటకు గురైంది.