CM Revanth Reddy: ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్ సంచలనంగా మారింది. మా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలలో అనేక అపోహలు.. అవాస్తవాలు ఉన్నాయని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bibek Debroy: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్, ఆర్థిక వేత్త బిబేక్ దేబ్రోయ్ (69)ఈ రోజు (శుక్రవారం) కన్నుమూశారు. పేగు సంబంధిత సమస్యతో దేబ్రోయ్ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
PM Modi Diwali Celebrations: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని కచ్కు చేరుకున్నారు. అక్కడ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దీపావళి రోజున సైనికులతో గడపాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారు. ప్రధాని మోడీ కచ్లో భారత సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్నారు. ప్రధాని అయిన తర్వాత గుజరాత్లోని సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఇదే తొలిసారి. కాబట్టి, ప్రధాని మోడీకి ఈ పర్యటన ప్రత్యేకం. గతంలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా…
PM Modi : ఉపాధి మేళా కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఎంపికైన 51,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు.
పెళ్లి పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య.. నంద్యాల జిల్లాలో పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేయడంతో.. మైనర్ బాలిక బలైంది. నందికొట్కూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యాసమోల్ తాగి బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది బాధితురాలు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మిడుతూరుకు చెందిన మైనర్ బాలిక కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. బాలికను తెలంగాణ పెబ్బేరు మండలం…
PM Modi Vadodara Visit: వడోదరలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోజు వడోదరలో సీ295 ఎయిర్క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ను ఇరువురు నేతలు ప్రారంభించారు. వడోదరలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) క్యాంపస్లో టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనితో పాటు, అమ్రేలిలో రూ. 4900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టును…
Spanish PM Sanchez India Tour: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం తెల్లవారుజామున గుజరాత్లోని వడోదర చేరుకున్నారు. సాంచెజ్కి చెందిన విమానం అర్ధరాత్రి 1.30 గంటలకు వడోదర విమానాశ్రయంలో దిగింది. ఆయన భారత్లో తన మొదటి అధికారిక పర్యటన చేయనున్నారు. స్పెయిన్కు తిరిగి వెళ్లే ముందు ఆయన మంగళవారం ముంబైకి వెళ్లనున్నారు. సోమవారం ఉదయం వడోదరలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సదుపాయాన్ని సంయుక్తంగా ప్రారంభించే ముందు శాంచెజ్ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి…
PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు.
PM Modi- Xi Jinping: బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమ్మిట్ కోసం రష్యాలోని కజాన్ నగరానికి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (బుధవారం) చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు.