PM Modi: మిడిల్ ఈస్ట్ సంక్షోభం వేళ.. మోడీతో ఇరాన్ అధ్యక్షుడి భేటీ..
- మిడిల్ ఈస్ట్ సంక్షోభం వేళ ప్రధాని మోడీతో ఇరాన్ ప్రెసిడెంట్ భేటీ..
- సమస్య పరిష్కారానికి న్యూఢిల్లీ సాయం చేయగలదన్న పెజెష్కియాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై భారతదేశం “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేసింది. చర్యలు, దౌత్యమార్గాల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది.
Read Also: Batenge to Katenge: ‘మహా’మంత్రంగా సీఎం యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం..
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ఇరాన్ అధ్యక్షుడు భారత జోక్యాన్ని కోరారు. మధ్యప్రాచ్యంలో సంక్షోభం తీవ్రతరం కాకుండా న్యూఢిల్లీ కీలక పాత్ర పోషించగలదని నొక్కి చెప్పారు. మిడిల్ ఈస్ట్లోని అన్ని దేశాలతో భారత్కి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూకి ఫోన్ చేశారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మోడీని కలిశారు. ఇరాన్ అధ్యక్షుడిని భారత్లో సందర్శించాలని ప్రధాని మోడీ ఆహ్వానించినట్లు మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదే విధంగా ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టు గురించి కూడా ఇరువురు నేతలు సంభాషించారు. భారత్-ఇరాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మాట్లాడారు. ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ లేదా INSTC వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత పీఎం మోడీ ఎక్స్లో .. “ఇరాన్ అధ్యక్షుడు మిస్టర్ మసూద్ పెజెష్కియాన్తో చాలా మంచి సమావేశం జరిగింది. మేము మా దేశాల మధ్య పూర్తి స్థాయి సంబంధాలను సమీక్షించాము. భవిష్యత్ రంగాలలో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి మార్గాలపై కూడా చర్చించాము..” అని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!