PM Modi: మిడిల్ ఈస్ట్ సంక్షోభం వేళ.. మోడీతో ఇరాన్ అధ్యక్షుడి భేటీ..
- మిడిల్ ఈస్ట్ సంక్షోభం వేళ ప్రధాని మోడీతో ఇరాన్ ప్రెసిడెంట్ భేటీ..
- సమస్య పరిష్కారానికి న్యూఢిల్లీ సాయం చేయగలదన్న పెజెష్కియాన్..
PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై భారతదేశం “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేసింది. చర్యలు, దౌత్యమార్గాల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది.
Read Also: Batenge to Katenge: ‘మహా’మంత్రంగా సీఎం యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం..
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ఇరాన్ అధ్యక్షుడు భారత జోక్యాన్ని కోరారు. మధ్యప్రాచ్యంలో సంక్షోభం తీవ్రతరం కాకుండా న్యూఢిల్లీ కీలక పాత్ర పోషించగలదని నొక్కి చెప్పారు. మిడిల్ ఈస్ట్లోని అన్ని దేశాలతో భారత్కి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూకి ఫోన్ చేశారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మోడీని కలిశారు. ఇరాన్ అధ్యక్షుడిని భారత్లో సందర్శించాలని ప్రధాని మోడీ ఆహ్వానించినట్లు మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదే విధంగా ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టు గురించి కూడా ఇరువురు నేతలు సంభాషించారు. భారత్-ఇరాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మాట్లాడారు. ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ లేదా INSTC వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత పీఎం మోడీ ఎక్స్లో .. “ఇరాన్ అధ్యక్షుడు మిస్టర్ మసూద్ పెజెష్కియాన్తో చాలా మంచి సమావేశం జరిగింది. మేము మా దేశాల మధ్య పూర్తి స్థాయి సంబంధాలను సమీక్షించాము. భవిష్యత్ రంగాలలో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి మార్గాలపై కూడా చర్చించాము..” అని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!