ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ 1000 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని సంజూ శాంసన్ అన్నాడు. టీమ్ మంచి ఫాంలో ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ వెల్లడించాడు.
రోహిత్ శర్మ పుట్టిన రోజును హైదరాబాద్ లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకంగా 60 అడుగుల రోహిత్ శర్మ కటౌట్ ను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కు కూడా ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదు.
జట్టుకు భారంగా మారాడని హార్థిక్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతను చివరిసారిగా ఎప్పుడు జట్టుకు ఉపయోగపడే ఇన్సింగ్స్ ఆడాడో కనీసం అతనికైనా గుర్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు. రెండు, మూడు మ్యాచ్ లు పక్కన కూర్చోబెడితే కానీ లైన్ లోకి వచ్చేలా కనిపించడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్-16వ సీజన్లో భాగంగా నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి పంజాబ్పై పోరాడి ఓడిన రోహిత్ సేన గుజరాత్పై తప్పనిసరిగా గెలవాలనే కసితో ఉంది.
ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఓటమిపై మ్యాచ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. చివరి ఓవర్ లో అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడని రోహిత్ పేర్కొన్నాడు.