GT vs MI: గుజరాత్ పరుగుల సునామీ.. ముంబై లక్ష్యం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Needs 208 Runs To Win Against Gujarat Titans: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (56) అర్థశతకంతో రాణించడం.. డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. గుజరాత్ అంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో రాహుల్ తేవాతియా కేమియో కూడా అదిరింది. అతడు కేవలం 5 బంతుల్లోనే మూడు సిక్సర్లు సహాయంతో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ముంబై ఇండియన్స్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది.
Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్.. నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఐదు ఓవర్లలో 1 వికెట్ నష్టానికి కేవలం 33 పరుగులే చేసింది. కానీ.. ఆరో ఓవర్ నుంచి జీటీ దూకుడు పెంచింది. అప్పటివరకూ ఆచితూచి ఆడిన శుభ్మన్, ఆ తర్వాతి నుంచి చెలరేగిపోయాడు. అయితే.. అర్థశతకం చేసుకున్నాక అతడు పెవిలియన్ చేరాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా (13) ఔటై నిరాశపరచగా.. శుభ్మన్ ఔటయ్యాక విజయ్ శంకర్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. 12.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 101 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. జీటీ 170 పరుగుల మైలురాయిని అయినా అందుకుంటుందా? అనే అనుమానం నెలకొంది. అప్పుడు క్రీజులో ఉన్న డేవిడ్, అనుభవ్.. ముంబై బౌలర్లపై దండయాత్ర చేశారు. ఎడాపెడా షాట్లతో బౌండరీలు బాదుతూ.. పరుగుల సునామీ సృష్టించారు. ఎలాంటి బంతులు వేసినా దంచి కొట్టారు.
Couple Revenge: దంపతుల ప్రతీకారం.. ఎయిర్బీఎన్బీ కంపెనీకి భారీ నష్టం
ఇక చివర్లో తానూ ఏం తిక్కువ తినలేదన్నట్టు.. రాహుల్ తేవాతియా కూడా చెలరేగిపోయాడు. వచ్చి రాగానే తొలి బంతికి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత మరో రెండు సిక్సులతోనూ అదరగొట్టాడు. డేవిడ్, అనుభవ్, తేవాతియా దున్నేయడంతో.. గుజరాత్ జట్టు 200 పరుగుల మైలురాయిని దాటేసి, 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్జున్, జేసన్, మెరిడిత్, కార్తికేయ చెరో వికెట్ పడగొట్టారు. మొదట్లో పొదుపుగా బౌలింగ్ వేసిన ముంబై బౌలర్లు.. చివర్లో మాత్రం భారీ పరుగులు సమర్పించుకున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్గా ఘనత..
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!