GT vs MI: గుజరాత్ పరుగుల సునామీ.. ముంబై లక్ష్యం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Needs 208 Runs To Win Against Gujarat Titans: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (56) అర్థశతకంతో రాణించడం.. డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. గుజరాత్ అంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో రాహుల్ తేవాతియా కేమియో కూడా అదిరింది. అతడు కేవలం 5 బంతుల్లోనే మూడు సిక్సర్లు సహాయంతో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ముంబై ఇండియన్స్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది.
Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్.. నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఐదు ఓవర్లలో 1 వికెట్ నష్టానికి కేవలం 33 పరుగులే చేసింది. కానీ.. ఆరో ఓవర్ నుంచి జీటీ దూకుడు పెంచింది. అప్పటివరకూ ఆచితూచి ఆడిన శుభ్మన్, ఆ తర్వాతి నుంచి చెలరేగిపోయాడు. అయితే.. అర్థశతకం చేసుకున్నాక అతడు పెవిలియన్ చేరాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా (13) ఔటై నిరాశపరచగా.. శుభ్మన్ ఔటయ్యాక విజయ్ శంకర్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. 12.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 101 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. జీటీ 170 పరుగుల మైలురాయిని అయినా అందుకుంటుందా? అనే అనుమానం నెలకొంది. అప్పుడు క్రీజులో ఉన్న డేవిడ్, అనుభవ్.. ముంబై బౌలర్లపై దండయాత్ర చేశారు. ఎడాపెడా షాట్లతో బౌండరీలు బాదుతూ.. పరుగుల సునామీ సృష్టించారు. ఎలాంటి బంతులు వేసినా దంచి కొట్టారు.
Couple Revenge: దంపతుల ప్రతీకారం.. ఎయిర్బీఎన్బీ కంపెనీకి భారీ నష్టం
ఇక చివర్లో తానూ ఏం తిక్కువ తినలేదన్నట్టు.. రాహుల్ తేవాతియా కూడా చెలరేగిపోయాడు. వచ్చి రాగానే తొలి బంతికి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత మరో రెండు సిక్సులతోనూ అదరగొట్టాడు. డేవిడ్, అనుభవ్, తేవాతియా దున్నేయడంతో.. గుజరాత్ జట్టు 200 పరుగుల మైలురాయిని దాటేసి, 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్జున్, జేసన్, మెరిడిత్, కార్తికేయ చెరో వికెట్ పడగొట్టారు. మొదట్లో పొదుపుగా బౌలింగ్ వేసిన ముంబై బౌలర్లు.. చివర్లో మాత్రం భారీ పరుగులు సమర్పించుకున్నారు.
తాజావార్తలు
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!