Ms Dhoni: సినిమాల్లో చిరంజీవి, క్రికెటర్లో ధోని.. తగ్గేదిలేదు. ఎంతమంది స్టార్లు వచ్చినా చిరు స్థానం తగ్గదు.. అలాగే కుర్ర క్రికెటర్లు ఎంతమంది వచ్చినా తల క్రేజ్ పోదు. ధోని ఏది చేసినా సంచలనమే. ఇక తాజాగా ధోని కుర్ర క్రికెటర్లతో కలిసి చిందు వేశాడు. దుబాయ్ లో జరిగిన పార్టీలో హార్దిక్ పాండ్య, మరికొందరతో కలిసి ధోని డ్యాన్స్ చేశాడు.
MS Dhoni Joins BJP Photo Viral: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని బీజేపీలో చేరనున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ ఇదే వార్తపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
MS Dhoni: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ ధోని.. బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నాడు. తనకిష్టమైన వ్యవసాయంతోపాటు.. ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమ నడిపిస్తున్నారు.
MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియాలో లైవ్లోకి వస్తానని.. గుడ్ న్యూస్ చెప్తానని శనివారం ప్రకటించాడు. దీంతో ధోనీ చెప్పే గుడ్ న్యూస్పై చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ధోనీ లైవ్లోకి వచ్చి చెప్పిన విషయం తెలిస్తే మీరు షాకవుతారు. ఇంతకీ ధోనీ ప్రకటించిన విషయం ఏంటంటే.. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ఓరియోను లాంచ్ చేశాడు. అయితే ఇది కమర్షియల్ ప్రకటన…
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఊహించని షాక్ ఇచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించిన పోస్టులను డిలీట్ చేశాడు. దీంతో.. సీఎస్కేకి జడేజా గుడ్బై చెప్పనున్నాడనే వార్తలు మరింత బలపడ్డాయి. నిజానికి.. చెన్నై జట్టుకి డెడికేటెడ్గా ఉన్న ఆటగాళ్లలో జడేజా ఒకడు. అతడు అత్యంత కీలకమైన ప్లేయర్ కూడా! ఒంటిచేత్తోనే ఆ జట్టుని ఎన్నోసార్లు ముందుకు నడిపించిన సందర్భాలున్నాయి. అలాంటి జడేనా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.…
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు 41వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సహచర ఆటగాళ్లు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత జట్టుకి నువ్వు అందించిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు. నువ్వు నాకు పెద్దన్నలా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్డే కెప్టెన్’’ అంటూ కోహ్లీ ట్వీట్…
భారత్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి క్రేజ్, ఫాలోయింగ్ గడించిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే.. అది మహేంద్రసింగ్ ధోనీనే! టీమిండియాకు అతడు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాడు. అతని సారథ్యంలోనే 28 ఏళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ గెలిచింది. తొలి టీ20 వరల్డ్కప్ని కూడా కైవసం చేసుకుంది. కెప్టెన్ కూల్గా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. అందుకే.. అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉన్నప్పటికీ ఇతని ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు 7వ…