MS Dhoni: చేపల వ్యాపారంలోకి ఎంఎస్ ధోని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని పేరు.. క్రికెట్ చూసే వారికి మాత్రమే కాదు.. క్రికెట్ చూడని వారికి కూడా మహేంద్ర సింగ్ ధోని తెలుసు. కెప్టెన్గా భారత జట్టుకు అనేక ఐసీసీ ట్రోఫీలు అందజేసిన మహి.. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై ప్రకటించిన తర్వాత.. వ్యవసాయంపై దృష్టి పెట్టారు. తమ పొలంలో పుచ్చకాయ,జామ, స్ట్రాబెర్రీ, కీరచ ఆవాలు, క్యాబేజీ, క్యాప్సికమ్, అల్లం వంటి పంటలు పండిస్తున్నాడు. అంతేకాదు కడక్ నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడు. టైం దొరికనప్పుడుల్లా ఎంఎస్ ధోని తన వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని తన వ్యవసాయ క్షేత్రంలోనే సొంతంగా ట్రాక్టర్ తో పొలం దున్నుతున్న ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు చేపల సాగుపైనా మిస్టర్ కూల్ దృష్టి పెట్టారు. రాంచీలోని ధోని ఫామ్ హౌస్ సాంబోలో ఇప్పుడు చేపలు కూడా సాగవుతున్నాయి. చేపల పెంపకం కోసం అక్కడ రెండు చెరువులను తవ్వారు. అందులో ఏడు నెలల క్రితమే చేప పిల్లలను వదిలిపెట్టారు. ఒక చెరువులో 5 వేలు.. మరో చెరువులో 3 వేలు.. మొత్తం రెండు చెరువులను కలిపి ఎనిమిది వేల చేప పిల్లలను పెంచుతున్నారు. చేపల చెరువుల పర్యవేక్షణ బాధ్యతను ప్రత్యేక బృందానికి అప్పగించారు. ఈ చేపలకు ఉదయం, సాయంత్రం మేత వేస్తారు.
Also Read
Read Also: ICC World Test Championship: డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎవరు.. ?
రెండు చెరువుల్లో రోహు, కట్ల, తెలాపియా రకాల చేపలను మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పెంచుతున్నారు. ఇప్పుడవి పెరిగి పెద్దవయ్యాయి. 500గ్రా. కిలోల నుంచి కిలోన్నర వరకు బరువు పెరిగాయి. ఎంఎస్ ధోని వ్యవసాయ సలహాదారు రోషన్ కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. మహికి నాన్ వెజ్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. దేశీ చికెన్ తో పాటు ఫిష్ ఐటమ్స్ తినడానికి ఇస్టపడతాడని రోషన్ తెలిపారు. మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి కూడా ఈ రెండు చెరువులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో కూరగాయాల సాగు, చేప పెంపకం తదితర విషయాలపై తరచూ సిబ్బంది నుంచి సాక్షి సింగ్ వివరాలు సేకరిస్తారని వెల్లడించారు.
ఎంఎస్ ధోనికి వీలు చిక్కినప్పుడల్లా వ్యవసాయ క్షేత్రంలో కలిగయ తిరుగుతూ పంటలతో పాటు కడక్ కోళ్ల ఫారమ్, చేపల చెరువులను పరిశీలిస్తున్నాడు. ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాధిస్తున్న ఎంఎస్ ధోని.. త్వరలోనే మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. మార్చి 31 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఎప్పటిలానే ఈసారి కూడా చెన్నై జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. ఆయనకు ఇదే ఆఖరి ఐపీఎస్ సీజన్ అని.. ఆ తర్వాత ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని టాక్ వినిపిస్తుంది.
తాజావార్తలు
-
Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Hyderabad Census : హైదరాబాద్లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
-
Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
-
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
-
Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?