MS Dhoni: ధోనీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఇక తగ్గేదే లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేంద్రసింగ్ ధోనీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్. ఐపీఎల్ 2023 కోసం మహీ రంగంలోకి దిగాడు. కొద్దిరోజులగా ప్రాక్టీస్లో మునిగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేవలం ఐపీఎల్లోనే ఆడుతున్న మహీ చాలా రోజుల తర్వాత బ్యాట్ పట్టాడు. నాలుగుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఈ మిస్టర్ కూల్.. ఈసారి మైదానంలో గర్జించేందుకు సిద్ధమయ్యాడు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్స్లో సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు రవీంద్ర జడేజా కూడా శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకొని మళ్లీ టోర్నీలకు సిద్ధమవుతున్నాడు.
Exclusive video of #MSDhoni batting practice at JSCA 💥🦁 pic.twitter.com/gYYR6hCpYY
Also Read
- BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
- Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
- Harry Brook: "టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే".. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
- Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే 'అగ్ని పరీక్ష'!
— Nithish MSDian 🦁 (@thebrainofmsd) January 25, 2023
నిరుడు ఐపీఎల్కు ముందే ధోనీ ఈ మెగాలీగ్ నుంచి తప్పుకొంటాడన్న వార్తలు వచ్చాయి. కానీ వాటన్నంటికీ సమాధానం చెబుతూ గతేడాది మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. కాగా, ఆటగాడిగా ధోనీకి ఈ ఐపీఎల్ చివరిదని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది జరిగే లీగ్లో ధోనీ ఆడటం దాదాపు అసాధ్యమే. అసలు ఈ ఏడాదే అతడు తప్పుకోవాల్సింది. అయితే తన చివరి మ్యాచ్ను చెన్నైలో ఆడాలని ఉందని, అక్కడ ఆడిన తర్వాతనే రిటైర్మెంట్ తీసుకుంటానని మహీ గతంలోనే చెప్పాడు. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్లో అతడు తన చివరి మ్యాచ్ ఆడేస్తాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా సీఎస్కే జట్టుతోనే ధోనీ ఉంటాడని, మెంటార్గానో లేక కోచ్గానో బాధ్యతలు నిర్వర్తిస్తాడని సమాచారం. గతేడాది దారుణంగా విఫలమైన చెన్నై.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్గా నిలవాలని చూస్తోంది. దానికోసం ఇప్పటికే మినీ వేలంలో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆ జట్టులో ధోనీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రుతురాజ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
తాజావార్తలు
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!