Rishabh Pant: చరిత్ర సృష్టించిన పంత్.. ఆ రికార్డ్ సాధించిన తొలి క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Creates Sensational Record In Tests: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్ని నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచిన పంత్.. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో మాత్రం మంచి ప్రదర్శన కనబరిచాడు. కేవలం 40 బంతుల్లోనే 46 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పంత్ రెండు భారీ సిక్స్లు బాదడంతో.. టెస్టుల్లో మొత్తం 50 సిక్స్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో.. టెస్టుల్లో ఈ ఫీట్ అత్యంత వేగంగా అందుకున్న తొలి క్రికెటర్గా పంత్ చరిత్రపుటలకెక్కాడు. అంతేకాదు.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్గానూ పంత్ నిలిచాడు.
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ఇప్పటి వరకు 128 మ్యాచ్లు ఆడిన పంత్.. 4021 పరుగులు సాధించాడు. వీటిలో అతడు వికెట్ కీపర్గా వ్యవహరిస్తూ.. 3651 రన్స్ (109 మ్యాచ్లు) నమోదు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు 15 అర్థశతకాలున్నాయి. అగ్రస్థానంలో మాత్రం భారీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. తన కెరీర్లో మొత్తం 535 మ్యాచ్లు ఆడిన ధోని.. ఓవరాల్గా 17092 పరుగులు సాధించాడు. వీటిలో 15 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా.. బంగ్లాతో జరుగుతున్న టెస్ట్లో.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే పంత్ చెలరేగడాన్ని చూసి, ఈ మ్యాచ్లో అతడు భారీ పరుగులు సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. 31.4 ఓవర్ వద్ద అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న పంత్ను మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.
India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్
మరోవైపు.. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ (22), శుభ్మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (1) పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్.. కాసేపు మెరుపులు మెరిపించి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం పుజారా, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. వీళ్లు ఆల్రెడీ అర్థశతకాలు చేసేసి, భారత్ని ఆదుకున్నాడు. టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరుని జోడించడంలో నిమగ్నమయ్యారు.
తాజావార్తలు
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!