Harbhajan Singh : సీఎస్కేకు ఆయన గుండెకాయ.. మా బలం.. బలగం: భజ్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ పదహారో సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పుడు భారత జట్టు మాజీ ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ సీఎస్కే ప్రధాన బలం మాత్రమే కాదు.. ఆ జట్టుకు గుండెకాయ లాంటివాడు అని ఆయన అన్నారు. అంతేకాదు మహీ తన జట్టులోని ప్రతి ఆటగాడితో అద్బుతాలు చేయించగల సమర్థుడని భజ్జీ వెల్లడించాడు. ధోనికి జట్టు సభ్యులపై పూర్తి అవగాహన ఉంటుంది. అతను ప్రతి ఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టగల సమర్థుడు.. సొంతగడ్డపై సీఎస్కే ప్రధాన బలం ఏంటంటే.. ఆ టీమ్ ఫ్యాన్స్ వాళ్లు.. సీఎస్కే జట్టు స్పూర్తిని పెంచుతారని భజ్జీ తెలిపారు.
Also Read : 3 Year Old Shoots Sister: బొమ్మ తుపాకీ అనుకొని.. అక్కనే కాల్చి చంపిన చిన్నారి
Also Read
- Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
మ్యాచ్ గెలిచినా.. ఓడినా వాళ్ల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఈ సీజన్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెన్నైకి కీలకం కానున్నాడని భజ్జీ అన్నాడు. జడ్డూ సూపర్ ఫామ్ లో ఉన్నాడని.. ప్రపంచంలోను అతనికంటే ఉత్తమ్ ఆల్ రౌండర్ మరొకరు లేరని తెలిపాడు. 16వ సీజన్ లో సీఎస్కే ఎక్స్ ఫ్యాక్టర్ తనేనని మాజీ స్పిన్నర్ వెల్లడించారు. భజ్జీకి ధోనీ కప్టెన్సీలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. 2018-2020 సీజన్ లలో సీఎస్కే తరపున ఆడాడు.
Also Read : Inter Exams : విద్యార్థులు టెన్షన్ పడొద్దు.. విజయం సాధించాలి..
పదిహేను సీజన్లుగా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. మార్చి 31న ఈ మెగా ఈవెంట్ షూరు కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ ను ధోనీ సేన ఢీ కొట్టనుంది. ఈ సీజన్ లో ప్రతి జట్టు తమ సొంత గ్రౌండ్ లోఏడు మ్యాచ్ లు ఆడనుంది. అంతేకాదు ఇంప్యాక్ట్ ప్లేయర్ ను తీసుకునే అవకాశం కూడా ఆయా జట్లకు ఉంది. ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. అతని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ సాధించింది. 2010.2011,2018,2021లో ఆ జట్టు ఛాంపియన్ గా అవతరించింది. మహీ ఆడనున్న ఆఖరి ఐపీఎస్ సీజన్ బహుశా ఇదే కావొచ్చని ప్రచారం జరుగుతుంది. అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే భావిస్తోంది.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!