Harbhajan Singh : సీఎస్కేకు ఆయన గుండెకాయ.. మా బలం.. బలగం: భజ్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ పదహారో సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పుడు భారత జట్టు మాజీ ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ సీఎస్కే ప్రధాన బలం మాత్రమే కాదు.. ఆ జట్టుకు గుండెకాయ లాంటివాడు అని ఆయన అన్నారు. అంతేకాదు మహీ తన జట్టులోని ప్రతి ఆటగాడితో అద్బుతాలు చేయించగల సమర్థుడని భజ్జీ వెల్లడించాడు. ధోనికి జట్టు సభ్యులపై పూర్తి అవగాహన ఉంటుంది. అతను ప్రతి ఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టగల సమర్థుడు.. సొంతగడ్డపై సీఎస్కే ప్రధాన బలం ఏంటంటే.. ఆ టీమ్ ఫ్యాన్స్ వాళ్లు.. సీఎస్కే జట్టు స్పూర్తిని పెంచుతారని భజ్జీ తెలిపారు.
Also Read : 3 Year Old Shoots Sister: బొమ్మ తుపాకీ అనుకొని.. అక్కనే కాల్చి చంపిన చిన్నారి
Also Read
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
మ్యాచ్ గెలిచినా.. ఓడినా వాళ్ల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఈ సీజన్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెన్నైకి కీలకం కానున్నాడని భజ్జీ అన్నాడు. జడ్డూ సూపర్ ఫామ్ లో ఉన్నాడని.. ప్రపంచంలోను అతనికంటే ఉత్తమ్ ఆల్ రౌండర్ మరొకరు లేరని తెలిపాడు. 16వ సీజన్ లో సీఎస్కే ఎక్స్ ఫ్యాక్టర్ తనేనని మాజీ స్పిన్నర్ వెల్లడించారు. భజ్జీకి ధోనీ కప్టెన్సీలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. 2018-2020 సీజన్ లలో సీఎస్కే తరపున ఆడాడు.
Also Read : Inter Exams : విద్యార్థులు టెన్షన్ పడొద్దు.. విజయం సాధించాలి..
పదిహేను సీజన్లుగా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. మార్చి 31న ఈ మెగా ఈవెంట్ షూరు కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ ను ధోనీ సేన ఢీ కొట్టనుంది. ఈ సీజన్ లో ప్రతి జట్టు తమ సొంత గ్రౌండ్ లోఏడు మ్యాచ్ లు ఆడనుంది. అంతేకాదు ఇంప్యాక్ట్ ప్లేయర్ ను తీసుకునే అవకాశం కూడా ఆయా జట్లకు ఉంది. ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. అతని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ సాధించింది. 2010.2011,2018,2021లో ఆ జట్టు ఛాంపియన్ గా అవతరించింది. మహీ ఆడనున్న ఆఖరి ఐపీఎస్ సీజన్ బహుశా ఇదే కావొచ్చని ప్రచారం జరుగుతుంది. అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే భావిస్తోంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!