మంత్రి అప్పలరాజు పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టించడానికి మంత్రికి సిగ్గనిపించడం లేదా… ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని అడిగారు. పలాసలో పోలీసులు వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారా , ప్రజలకోసం పనిచేస్తున్నారా. టీడీపీ నుంచి ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పడేశారు. వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే టీడీపీ వారి పై కేసులు పెట్టారు. మాకూ సోషల్ మీడియా ఉంది… మేం పోస్టులు పెట్టలేక కాదు..…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సవాల్ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్నాయుడు.. విశాఖ…
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి.. ఆ చట్టంలోని మెజార్టీ అంశాలు అమలుకు నోచుకోలేదని రెండు రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర హోంశాఖ.. “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం” అమలు గురించి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రశ్నించారు.. విభజనచట్టంలో పొందుపరచిన అంశాలు అన్నీ నెరవేర్చారా? లేదా? లేకపోతే అమలుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉప్పినవలస ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. అయితే సొంతింటిలో బాబాయ్ హత్య జరిగాక జగన్ రాజకీయాలు చేశారు. జగన్ ను ఆదర్శంగా తీసుకుని వైసీపీ కార్యకర్తలందరూ అరాచకం సృష్టిస్తున్నారు. ఉప్పినవలసలో పట్టపగలు కత్తులతో సినిమా స్టైల్లో దాడి చేశారు. ఇలాంటి సంస్కృతిని శ్రీకాకుళం జిల్లాకు తీసుకొచ్చిన ఘనత స్పీకర్ తమ్మినేని సీతారాంకే దక్కింది. ఆడవాళ్లను సైతం మృగాళ్లలాగా కత్తులతో నరికారు…
సీఎం జగన్ మోహన్ రెడ్డికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ రాసారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ను 25 లక్షలకు పెంచాలి. ఆధారం కోసం కోవిడ్ పాజిటివ్ టెస్టునే కాకుండా, డెత్ సర్టిఫికెట్ ను కూడా అంగీకరించాలి . అనాధలుగా మారిన పిల్లలకు ఉపశమనం కోసం తక్షణమే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేషన్ వరకూ పిల్లల…