40 ఏళ్ళ ‘ప్రేమకానుక’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు)
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు.
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
ఇందులో హీరో రాజశేఖర్ ఓ పెయింటర్ గా ఓ ఊరికి వెళతాడు. గౌరీ అనే ఓ అందమైన అమ్మాయి బొమ్మలు గీస్తాడు. అది నచ్చని ఆ ఊరి షావుకారు జంతువుల జగన్నాథమ్ కూతురు సంధ్య పెయింటింగ్స్ ను పాడు చేస్తుంది. రాజశేఖర్ గత జన్మలో తాను సంధ్య ప్రేమించుకున్నామని, అందుకే ఇప్పుడు ఇలా కలుసుకున్నామని చెబుతాడు. రాజా, సంధ్య ప్రేమించుకుంటారు. జగన్నాథమ్ మేనల్లుడు మోహన్ నీచుడు. అతను ఎలాగైనా సంధ్యను తనదానిగా చేసుకోవాలని చూస్తుంటాడు. రాజా వల్ల సంధ్య గర్భవతి అవుతుంది. రాజాకు గౌరీకి సంబంధం ఉందని చూపిస్తారు జగన్నాథమ్ అండ్ కో. అపార్థం చేసుకున్న సంధ్య గర్భస్రావానికి పాలు పడుతుంది. అప్పుడు రాజా తన మతిస్థిమితం లేని అక్కను చూపిస్తాడు. ఆమె అలా కావడానికి కారకుడు జగన్నాథమే అని చెబుతాడు. తన తండ్రి నీచత్వం తెలుసుకున్న సంధ్య, రాజాకు సహకరిస్తుంది. గౌరీని మోహన్ రేప్ చేస్తాడు. అతణ్ణి చట్టానికి పట్టిస్తాడు రాజా. జగన్నాథమ్ తనను క్షమించమంటాడు. చివరకు రాజా సీబీఐ ఆఫీసర్ అని తెలుస్తుంది. మోహన్ ను పట్టుకోవడం కోసమే పెయింటర్ గా రాజా అవతారమెత్తి ఉంటాడు. చివరకు రాజా, సంధ్య పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
‘ప్రేమాభిషేకం’లో జోడీ కట్టి అలరించిన ఏయన్నార్, శ్రీదేవి ఇందులోనూ మరోమారు మురిపించారు. మధుమాలిని, రావుగోపాలరావు, సత్యనారాయణ, మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, చలపతిరావు, నర్రా, మనోరమ, సుభాషిణి, మాస్టర్ హరీశ్ నటించారు. గుహనాథన్ కథ అందించిన ఈ చిత్రానికి సత్యానంద్ సంభాషణలు, ఆచార్య ఆత్రేయ పాటలు, చక్రవర్తి సంగీతం సమకూర్చారు. “అయ్యారే తుంటరోడా…”, “ఈ కొండ కోనల్లో…”, “చెమ్మ చెక్కా…”, “వంట చేసి చూపిస్తా…”, “జంతర్ మంతర్…” సాంగ్స్ జనాన్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..