ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘శ్వేతపత్రం’కు ప్రతిగా కాంగ్రెస్ పార్టీ ‘బ్లాక్ పేపర్’ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్' ప్రస్తావనకు రానుందని సమాచారం.
మయన్మార్ సరిహద్దు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్- మయన్మార్ల సరిహద్దులో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచెను (Fencing) నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు.
రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడ్ న్యాయ యాత్ర ఫలించకపోతే ప్రజలకు కష్టాలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ బకాయి నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వారం రోజుల అల్టిమేటం ఇచ్చినట్లు తెలిపారు.
Budget 2024 : ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని పన్ను చెల్లింపుదారులు శుభవార్త వినవచ్చు. ఇది ఎన్నికల సంవత్సరం.. కాబట్టి పన్ను చెల్లింపుదారులను తమవైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది.
Budget 2024 : దేశంలో ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందు మహిళా రైతులకు పెద్ద వార్త రావచ్చు. మహిళా రైతులకు ఏటా ఇచ్చే సమ్మాన్ నిధిని ప్రధాని నరేంద్ర మోడీ రెట్టింపు చేయనున్నారు.
Siddaramaiah : కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద ఆరోపణ చేశారు. కర్ణాటకలో కరువు సాయంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
సీడబ్ల్యూసీ మీటింగ్ హైదరాబాద్ లో ఇటీవల జరిగింది అని చిదంబరం అన్నారు. Cwc మీటింగ్ తర్వాత జరిగిన సభ.. నా జీవితంలో అలాంటి సభ చూడలేదు.. ఆ సభలో 45 శాతం 25 ఏళ్ల యువకులు ఉన్నారు.. సభ చూశాక.. తెలంగాణ మార్పు తధ్యం అని అర్థమైంది.. క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా తమకు దక్కాల్సింది మిస్ అయ్యింది అనే ఫిలింగ్ లో ఉంది.
సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. వంటగ్యాస్ ధరలను రూ.200 వరకు తగ్గించాలని ఇప్పటికే మోడీ సర్కార్ నిర్ణయించింది. త్వరలో సిలిండర్పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతోంది.
గత ఎనిమిదేళ్లలో జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 15 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) తొమ్మిదేళ్ల క్రితం ఆగస్టు 28, 2014న ఆర్థిక చేరిక లక్ష్యంతో ప్రారంభించబడింది.