ధరణి పోర్టల్ తంటాలను తెంచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు మునుగోడు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. దేశ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర అని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలపై రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డులు, పలు కాలనీలు, వంతెనలపై నీరు చేరింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతుండటంతో.. చాలా ప్రాంతాల్లో పరిస్థితి ఊరు.. ఏరు ఏకమైందా అన్నట్టు.. పలు చోట్లు వర్షాలు, వరదల కారణంగా ఎంతోమంది పేదలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే.. ములుగు జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమై పలు గ్రామాలకు రాకపోకలు…
ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ ధరణి రచ్చబండ కార్యక్రమంలో సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూముల విలువ పెంపకం పేరుతో దందాలు జరుగుతున్నాయని చెప్పిన ఆమె.. దున్నేవాడికి కేసీఆర్ భూమి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం అడ్డగోలుగా భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎక్కడ భూములున్నా లాక్కుంటున్నారని విమర్శించారు. అటు.. ఫారెస్ట్ అధికారులు కూడా భూములు లాక్కుంటూ, పోడు రైతులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్…
రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. వరంగల్ సభతో రాహుల్ గాంధీ అద్భుతంగా ప్రసంగించారని.. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఐతే రాహుల్ పర్యటన నేపథ్యంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న వరంగల్ సభ సందర్భంగా.. రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కాశీ తాడును కట్టారు. ఆ సమయలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేతిని పట్టుకోగా..…
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మే 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మే 4న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన బోయిన్పల్లిలో కార్యకర్తలతో సమావేశమవుతారు. దీంతో రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మదు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ…