MLA Seethakka: బీజేపీ, టీఆర్ఎస్లు పేదలను దోచుకుంటున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka Fires On BJP and TRS Parties In Munugodu By Election Campaign: కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు పేదలకు పన్నులు పెంచి.. పెద్దలకు దోచిపెడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, ప్రజల కోసం అనేక పనులు చేసిందని అన్నారు. పేదల కడుపులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ చట్టం తెచ్చి.. వంద రోజుల పని కల్పించిందన్నారు. బడి తెచ్చినా, గుడి తెచ్చినా, రోడ్డు వేసినా, బస్ వచ్చినా.. అవి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినవేనన్నారు. ప్రశ్నించే గొంతుకలు, ఆత్మ గౌరవంతో బతికే వాళ్ళు కావాలని పిలుపునిచ్చిన సీతక్క.. ఇక్కడ కొంతమంది ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలు మారారంటూ మండిపడ్డారు. అధికార పార్టీలకు దాసోహం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే పార్టీలో ఉంటే ఎంతో గౌరవం ఉంటుందని చెప్పారు.
పేదల కోసం సోనియా గాంధీ అనేక సంస్కరణలు తెచ్చారని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆత్మగౌరవమని.. ఎంతోమంది తమ పనుల గురించి అసెంబ్లీలో ప్రశ్నించమని కోరుతుంటారని.. ఇలా ప్రజల కోసం పని చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని సీక్క తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున తాను ఒక్కదాన్నే ఆడ మనిషిని ఉన్నానని.. తనకు తోడుగా పాల్వాయి స్రవంతిని పంపించాలని కోరారు. మునుగోడు సమస్యలన్నీ తీర్చుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి కొందరు అమ్ముడుపోయారని.. కానీ తాను అలా అమ్ముడుపోనని, మీ కోసమే పని చేస్తామనని ప్రజలకు మాటిచ్చారు. ప్రజల కోసం పని చేసే వారిని, ప్రశ్నించే గొంతులకు అవకాశం ఇవ్వాలని కోరిన ఆమె.. అమ్ముడుపోయే వాళ్ళు ప్రజల కోసం ఏం పని చేస్తారని ప్రశ్నించారు. తమతో చెయ్యి కలపాలని.. పాల్వాయి స్రవంతిని గెలిపించాలని సీతక్క కోరారు.
Also Read
తాజావార్తలు
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?