మెదక్ జిల్లా తూఫ్రాన్లో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్ర లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులకు హెల్త్ కార్డు తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు భూతాల ఉద్యమంలో భూములు పంచితే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని…
ప్రధాని మోడీపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ జీ 7 సంవత్సరాల నుండి రోజుకు 18 గంటలు పని చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ (గౌతమ్ అదానీ)ను ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా మారే కలను సాకారం చేసుకున్నారంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. అయితే గతంలో చైనాకు చెందిన ఓ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నారని.. ఆయన పెండింగ్లో…
ఇక్కడ భూమి ఒక్కరిది, రైతు బంధు ఒక్కరిది. భూ సమస్యల పరిష్కారం ఏమో కాని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నరు. భూమి ఉన్నోళ్లకు రైతు బంధు వస్తలేదు. అర్హులకు పథకాలు అందడం లేదు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ధరణి అనేదే సమస్యల పుట్ట అని చెప్పిన సీతక్క భూస్వాములకు ధరణిలో సమస్యలు లేవు. కొద్దీ మొత్తం భూమి ఉన్న రైతులకే ఈ సమస్యలు. వాళ్ళకి కావాల్సినవి సీక్రెట్ గా చేస్తరు. రైతులకు ఎంలేదు. దళిత బంధు…
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా యాత్ర నిర్వహించారు.. కూరగాయల మార్కెట్ నుండి ఎంఆర్వో కార్యాలయం వరకు పాదయాత్రగా.. భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సీతక్క.. అయితే, దండోరయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.. ఒక్కసారిగా బీపీ పడిపోవటంతో కళ్లు తిరిగి పడిపోయారు సీతక్క.. దీంతో.. వెంటనే ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కార్యకర్తలు.. సీతక్క ప్రస్తుతం ఆస్పత్రిలో…
టీఆర్ఎస్ నేతలకు ఎన్నికలు జరిగితేనే ప్రజలు గుర్తుకు వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు, ఇంద్రవెల్లి సభ ద్వారా పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందంటూ ఆమె టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గడిచిన ఏడేళ్లుగా పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలని సీతక్క డిమాండ్ చేశారు. జనాలు రేవంత్…
కేసీఆర్ సర్కార్ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మాట్లాడిన ఆమె.. నిజాం కాలం తరహాలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు.. నాటి నుంచీ నేటి వరకు భూమికోసం పోరాటం తప్పడం లేదన్న ఆమె.. తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ నుంచి చేసే ఇంద్రవెల్లి దండోరా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు… కొమురం భీం పోరాటం చేసిన పోరుగడ్డ ఇది అని ఆమె…
నిన్న మొన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమైన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు గేర్ మార్చారట. మొత్తం కోల్ బెల్ట్ను చుట్టేసి.. అక్కడ పాగా వేయాలని వ్యూహం రచించారట. అధికారపక్షం బలంగా ఉన్న చోట.. ఆ విపక్ష ఎమ్మెల్యే ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా? ఉత్తర తెలంగాణలో సీతక్క కీలక పాత్ర పోషిస్తారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ములుగు నియోజకవర్గం తప్ప ఇతర ప్రాంతాల్లో పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. గిరిజన తండాల్లో చురుకుగా పర్యటించడానికి ప్రాధాన్యం ఇస్తారామె. కనీసం ఉమ్మడి…
పెట్రోల్,డిజిల్ ధరల పెంపును నిరసిస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్ నేతల ధర్నా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెట్రోల్,డిజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేసిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… ప్రభుత్వం 35 రూపాయలు పెట్రోల్ కి 65 రూపాయల టాక్స్ వసూలు చేస్తుంది అన్నారు. సాధారణ ప్రజల దగ్గర ఇంత దోచుకుంటూ పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యాపారులు చెల్లించనీ లోన్లు…