Madhu Yashki Goud : రైతు సంఘర్షణ సభ పేరుతో రాహుల్ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మే 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మే 4న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన బోయిన్పల్లిలో కార్యకర్తలతో సమావేశమవుతారు. దీంతో రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మదు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ 2 రోజుల టూర్ ఖరారు అయ్యిందని, రైతు సంఘర్షణ సభ పేరుతో రాహుల్ సభ నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రైతు రుణ మాఫీ, రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సభ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. రైతులు నష్ట పోతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అని చెప్పి…ఇప్పటికీ సాయం అందించలేదని ఆమె మండిపడ్డారు. రైతులు రాహుల్ గాంధీ సభకు రావాలని కోరుతున్నామన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!