హైదరాబాద్లో వరుసగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి.. అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఇవాళ్టితో ముగిసిపోయాయి.. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ మీటింగ్కు అనుమతి ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్.. కాంగ్రెస్ పార్టీ 120 మందితో 9 నుంచి 11 వరకు హైదరాబాద్ శిక్షణ శిబిరాలు పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. 300 మందితో సంఘ్ శిక్షణకు భద్రత, అనుమతి…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య సఖ్యత కుదరడం లేదనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి విముఖతతో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే తాజాగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. దీంతో ఒక్కసారి టీకాంగ్రెస్ సీనియర్ నేతలు ఉలిక్కి పడ్డారు. ఈ పరిణామాల నడుమ జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని ప్రత్యక్షప్రసారంగా వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి.. ఈ పేరు చెబితే అంతగా గుర్తు పట్టకపోవచ్చు కానీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటే మాత్రం తెలంగాణవాసులందరికీ సుపరిచితమే. ఈ రాజకీయ ప్రస్థానం కౌన్సిలర్గా ప్రారంభమైంది. ఆ నాటి నుంచి నేటి వరకు వివిధ పార్టీలు మారినా తన దైన శైలితో రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి, ఓ సారి చీఫ్ విప్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంత రాజకీయ అనుభవం…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాను టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేస్తున్నారని ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సదరు ఛానళ్లు రేవంత్రెడ్డికి అభిమానులుగా పనిచేస్తున్నాయని… రేవంత్కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకముందు మూడేళ్ల కిందటి నుంచే రాజు వస్తున్నాడంటూ తెగ హడావిడి చేసినట్లు గుర్తుచేశారు. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నానని… కేటీఆర్ ఎదురుపడితే పలకరించానని జగ్గారెడ్డి తెలిపారు.…
ఈ మధ్యే రేవంత్రెడ్డిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని మార్చాలని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని ఆ లేఖలో ప్రస్తావించడం హాట్టాపిక్గా మారింది.. అయితే, ఇప్పుడు రేవంత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి..…
తెలంగాణ సీఎం కేసీఆర్కు మరోలేఖ రాశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఈసారి ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఇంటర్ విద్యార్థులకు పాస్ మార్కులు వేయాలని కోరిన ఆయన.. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తేవొద్దని.. ఇది రాష్ట్రానికి మంచిది కాదని విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడొద్దు అంటూ సీఎం దృష్టికి తీసుకెళ్లిన జగ్గారెడ్డి.. కనీస మార్కులు వేసి అందరినీ పాస్ చేయాలని కోరారు.. ఈ విషయంపై విద్యార్థులు…
ఆ మంత్రికి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మధ్య అంత కెమిస్ట్రీ ఎలా కుదిరింది? అదేజిల్లాకు చెందిన మంత్రిని నిత్యం టార్గెట్ చేస్తున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఎందుకు కలివిడిగా తిరిగారు? రానున్న రోజుల్లో ఈ పరిణామాలు.. జిల్లా రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాయా? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఎవరా కాంగ్రెస్ ఎమ్మెల్యే? ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య వైరమైనా.. స్నేహమైనా హాట్ టాపిక్కే. అలాంటి అరుదైన దృశ్యాలకు సంగారెడ్డి జిల్లాలో…
ఎన్నికల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వ సాధారణమైన విషయం.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాలెంజ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తన పంతం నెగ్గించుకున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గతంలో సవాల్ చేసిన ఆయన.. ఈ రోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు రావడంతో తన పంతం నెగ్గించుకున్నారు.. జగ్గారెడ్డి…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. అయితే, ఈ ఎపిసోడ్ ఇవాళ్టితో ముగిసిపోయిందని.. మళ్లీ రిపీట్ కాదని ప్రకటించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో సమావేశమైన వివరణ ఇచ్చారు జగ్గారెడ్డి.. నిన్నటి వ్యవహారంపై కార్యదర్శులు ఆయనతో మాట్లాడారు.. తను వ్యాఖ్యలు చేయడానికి కారణాలను పార్టీ నేతలకు ఏకరువు పెట్టారు.. ఇక, అనంతరం మీడియాతో…
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ పార్టీలో తాజాగా జరుగుతున్న కొన్న ఘటనలపై స్పందించిన జగ్గారెడ్డి… పార్టీ బాగు కోసమే నేను మాట్లాడుతున్న.. రేవంత్ ఒక్కడితో అంతా అయిపోదన్నారు.. అందరినీ కలుపుకుని పోవాలని సూచించిన ఆయన.. రేవంత్ తీరుపై సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. నేను మాట్లాడేది తప్పు అయితే.. రేవంత్రెడ్డి చేసేది కూడా తప్పే అంటున్నారు జగ్గారెడ్డి. ప్రతీ సభలో ఎవ్వరినీ ఆయన…