తెలంగాణ సీఎం కేసీఆర్కు మరోలేఖ రాశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఈసారి ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఇంటర్ విద్యార్థులకు పాస్ మార్కులు వేయాలని కోరిన ఆయన.. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తేవొద్దని.. ఇది రాష్ట్రానికి మంచిది కాదని విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడొద్దు అంటూ సీఎం దృష్టికి తీసుకెళ్లిన జగ్గారెడ్డి.. కనీస మార్కులు వేసి అందరినీ పాస్ చేయాలని కోరారు.. ఈ విషయంపై విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్పందిస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు.
మంత్రులు.. కనీసం ఆలోచన చేయకుండా ఇంటర్ ఫలితాలు ప్రకటించడం సరైంది కాదన్నారు జగ్గారెడ్డి.. అనాలోచిత నిర్ణయాలు.. ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని లేఖలో పేర్కొన్నారు జగ్గారెడ్డి.. విద్యార్థులు రోడ్డెక్కే వరకు పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన ఆయన.. పిల్లలు చనిపోకుండా ఆపండి అన్నారు. కాబట్టే వెంటనే స్పందించి.. వచ్చే 12 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించారు జగ్గారెడ్డి.. లేదంటే రేపు ఇంటర్ బోర్డు ముందు రెండు గంటలు దీక్ష చేస్తానని.. ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకు దీక్ష చేస్తానని హెచ్చరించారు.. ఇక, ఇంటర్ ఫలితాల విషయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫెయిల్ అయ్యారని దుయ్యబట్టిన జగ్గారెడ్డి.. పిల్లల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లి నచ్చజెప్పాలని సూచించారు.