రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్కార్డులు జారీ చేయనున్నుట్లు ప్రకటించారు. నేడు నగరంలో కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన కేటీఆర్ మాట్లాడుతూ.. అతి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘మీ శాసనసభ్యుడు, కార్పొరేట్ల చేతుల మీదుగా.. మీరు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా.. ఎవరి చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ బస్తీమే.. మీ కార్పొరేటరే వచ్చి.. ఎవరు ఎవరు అర్హులున్నారో ఒక్కరూ మిస్ కాకుండా ఇచ్చే…
భాగ్యనగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్డీపీ కింద 8052 కోట్ల రూపాయలతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయన్నారు. 3117 కోట్ల రూపాయలతో రెండో దశ ఎస్ఆర్డీపీ మొదలు పెడతామన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్లో నివాసముంటున్నారు. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. కూకట్పల్లి IDPLలో ఎందుకు రోడ్లు వేస్తున్నారని.. ఇక్కడి కేంద్ర మంత్రి అడగటమే…
హైదరాబాద్ అంటే ఓ ట్రాఫిక్ సముద్రం. ఈ సముద్రంలో ఈదుతూ ఆఫీస్ నుంచి ఇంటికో.. లేక కాలేజ్, స్కూల్ ఇలా ఎక్కడి నుంచైనా ఇంటికి వెళ్లేసరికి ఉన్న ఉత్సాహం కాస్తా ఆవిరైపోతుటుంది. కానీ ఇది ఒకప్పటి మాట.. ప్రస్తుతం గ్రేటర్ వాసుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మెట్రో ప్రారంభమైననాటి నుంచి ఆయా ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ సమస్య తీరినట్లు చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మరో ఫ్లైఓవర్ గ్రేటర్వాసుల ట్రాఫిక్ కష్టాలను…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్ముతున్న మోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్ మెంట్…
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో రూ.170 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసగించారు. పల్లెలో నర్సరీ, రైతు వేదికలు, ఇంటింటికీ నల్లా, ట్రాక్టర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్. కరెంటు సమస్య తీరింది, 24గంటలు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనేనని ఆయన వెల్లడించారు. కృష్ణా నీటి వాటాను కేంద్రం తేల్చలేదని, నార్లాపూర్, ఏదుల, కర్వెన, ఉధండాపూర్ ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం చేస్తామని ఆయన వెల్లడించారు. డబుల్ బెడ్రూం,పింఛన్లు,…
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తెలంగాణలో నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న అలర్లు దానికి నిదర్శనం. అయితే అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తుతుంటే.. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎయిర్ఫోర్స్ లాంటి విభాగాల్లో అగ్నివీరులకు ప్రత్యేక కేటాయింపు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. స్విస్ బ్యాంకుల నుంచి…
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చామని అయినా అభివృద్ధి జరగలేదని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు మంత్రి కేటీఆర్. కోల్లాపూర్ లో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన మందులాంటిది కాంగ్రెస్ అని.. ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెస్తామని చెప్పారని.. మాట…
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఆందోళన విరమించే దిశగా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని పవన్ కోరారు. గత కొద్దిరోజులుగా…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా గోపినాధ్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం సమ్మతమే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మంత్రి కేటీఆర్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ‘ఏ ఇంటికైనా…
మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రులు అభివృద్ధి చెందలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి చేస్తున్నామని, కొడంగల్, కోస్గి ఆస్పత్రుల్లో మెడికల్ సదుపాయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.…