Minister KTR: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి మతిస్థిమితం లేదని, ఆయన నోట్లో నుంచి వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్, బీజేపీ మనిషి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
గాంధీ భవన్ లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భూమి డిక్లరేషన్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వెనక పెద్ద గూడు పుటాని జరిగింది.. రోజుకోకటి బయట పెడతామని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ టేరసీసీ కంపనీ వెనుక.. ఫిలిప్పీన్.. దాని వెనక అమెరికా కంపెనీలు వచ్చాయన్నారు. విదేశీయులు ధరణి పోర్టల్ నడుపుతున్నారు అని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు.
Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా లోని 1650 మందికి పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ముందుగా జిల్లా తంగళ్లపల్లి మండలం వ్యవసాయ కళాశాలలో ఉదయం 11 గంటలకు బాబు జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
హైదరాబాద్ కోకాపేట్లోని వన్ గోల్డెన్ మైల్లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా సెమీకండక్టర్ డిజైన్, డెవలప్మెంట్ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాస్కోమ్ లెక్కల ప్రకారం దేశంలో సెమీకండక్టర్ రంగంలో 1/3 ఉద్యోగాలు హైదరాబాదు నుంచే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. బెంగళూరు చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Minister KTR Says Metro Rail for Hyderabad Airport: హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వచ్చింది. శనివారం ఉదయం నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రేటర్ చుట్టూ 158 కిమీ మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఇప్పటివరకు 19 ఇంటర్ చేంజ్లు ఉండగా.. కొత్తగా మరో మూడింటిని ప్లాన్ చేశారు. నార్సింగి, కోకాపేట నియో పొలీస్, మల్లంపేట ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ముందుగా నార్సింగి ఓఆర్ఆర్…
మహబూబాబాద్ జిల్లాలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మోడీ వరంగల్ ప్రజలకు క్షమాపన చెప్పిన తరువాతే ఈ జిల్లాకు రావాలి అని అన్నారు. మరో పదిరోజుల్లో నరేంద్ర మోడీ వరంగల్ కు వస్తున్నారు.. నరేంద్ర మోడీని మా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరుపున అడుగుతున్నాను అని కేటీఆర్ అన్నారు.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న హైదరాబాద్ లో ఒకే రోజు 5 హత్యలు చోటు చేసుకున్నాయని.. నిన్న సూర్యాపేటలో పట్టపగలే దారుణ హత్య జరిగిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ మానుకోటలో పోడు రైతులకు పట్టాలు పంపిణీతో పాటు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని జిల్లాలోని 24,181మంది పోడు రైతులకు 67,730ఎకరాల పోడు పట్టాలను ఆయన అందించనున్నారు.