హైదరాబాద్ కోకాపేట్లోని వన్ గోల్డెన్ మైల్లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా సెమీకండక్టర్ డిజైన్, డెవలప్మెంట్ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాస్కోమ్ లెక్కల ప్రకారం దేశంలో సెమీకండక్టర్ రంగంలో 1/3 ఉద్యోగాలు హైదరాబాదు నుంచే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. బెంగళూరు చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశానికి లైఫ్ సైన్సెస్ కాపిటల్గా హైదరాబాద్ ఉందని, భారత్ లో అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్క్ కూడా హైదరాబాద్ లోనే ఉందని ఆయన అన్నారు.
Also Read : Kadapa: స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి..
హైదరాబాద్ ను పోల్ పొసిషన్ తీసుకొచ్చేందుకు మెుబిలిటీ వ్యాలీను కూడా తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జీనోమ్ వ్యాలీ హెడ్ క్వార్టర్స్ అని, టాస్క్ ద్వారా విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అని, సెమీ కండక్టర్ రంగంలో హైదరాబాద్ నగరం అద్భుతంగా ముందుకెళ్తోందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు.
CM Jagan : నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత నేను ఎప్పటికీ మర్చిపోలేను