కరోనా మహమ్మారితో ఆర్థిక సంక్షోభం తలెత్తిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.. ఇక రూ. 500 కోట్లతో అన్ని మున్సిపాలిటీలలో మార్కెట్లు సిద్ధం చేశామన్న ఆయన.. మెట్ పల్లిలో 2.57 కోట్ల రూపాయలతో వెజ్ ఆ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేశామని.. 138 మున్సిపాల్టీల్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. మున్సిపాలిటీలకు ప్రతి నెలా…
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు కప్పి పుచ్చుకోవడానికి…నిర్లక్ష్యాన్ని కేంద్రంపై మోపుతున్నారని… కేటీఆర్ కళ్లు ఉన్నోడు అయితే ఇలాంటి విషం చిమ్మడని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే కుళ్లు మనస్తత్వం కేటీఆర్ ది అని.. భారత్ బయోటెక్ ను వాళ్ళు విజిట్ చేశారా.. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసారా? అని నిలదీశారు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. ట్విట్టర్ మంత్రిగా మారిపోయారు… హైటెక్ మంత్రిగా గొప్పలు చెప్పుకుంటున్నాడని..…
చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాల్క సుమన్ తండ్రి, మెట్పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా చెన్నూరు ఎమ్మెల్యే సుమన్ ను టీఆర్ఎస్ నేతలు పరామర్శిస్తున్నారు. కాగా రేపు మంత్రి కేటీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మెట్ పల్లిలో బాల్క సుమన్ ను కేటీఆర్ పరామర్శించనున్నారు. అనంతరం కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లో కూడా కేటీఆర్ పర్యటించనున్నారు. ఇదివరకు ముఖ్యమంత్రి…
వాక్సినేషన్ కార్యక్రమంపైన ప్రజల నుంచి సలహాలను, సూచనలను మంత్రి కే తారకరామారావు ఈ రోజు స్వీకరించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో కోనసాగిన ట్విట్టర్ సంభాషణలో మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తు, ప్రజల నుంచి వచ్చిన విలువైన సలహాలు పైన సూచనలు పైన స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నదని, ఓల్డ్ ఏజ్ హోమ్ ల్లోనూ వాక్సినేషన్…
తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కరోనా రోగులకు సేవలు అందించడానికి ప్రత్యేక మొబైల్ యూనిట్లను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతలో 30 మొబైల్ ఐసీయూ బస్సులను హైదరాబాద్లో ప్రారంభించారు మంత్రి కేటీఆర్.. మొదటి దశలో జిల్లాకు ఒకబస్సును కేటాయిస్తున్నామన్న మంత్రి.. త్వరలో జిల్లాకు రెండు బస్సుల చొప్పున పంపిస్తామన్నారు. ఇది వినూత్న ఆలోచన.. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం మొదటిసారి అని వెల్లడించారు. ఇక, వైద్యులను దేవుడితో సమానంగా చూస్తున్నారు.. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి..…
తెలంగాణలో హరిత విప్లవానికి సీఎం కేసీఆర్ తెరలేపారు అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్.. ఇవాళ సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయానికి దేశంలో ఏ రాష్ట్రం, ఏ నాయకుడు ఇవ్వని ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని తెలిపారు.. టిఆర్ఎస్ ప్రభుత్వం కర్షక ప్రభుత్వమని ప్రకటించిన ఆయన.. ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మత్తల్లు దుకించినా ఘనత కేసీఆర్దే అన్నారు.. రైతాంగానికి రైతు బీమ, రైతు బంధు పథకాల ద్వారా ప్రోత్సాహం టిఆర్ఎస్…
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ అంశంతో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్…
కరోనా వ్యాక్సిన్ల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుందని.. నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిపడ్డ ఆయన.. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ సప్లై కూడా లేదన్నారు. ఇక, కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యల్లోనూ కేంద్రానికి ముందు చూపు…
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. కాగా, తాజాగా జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సమ్మె చేసేందుకు ఇది సమయం కాదన్నారు. సమ్మె విరమించాలని అందరినీ కోరుతున్నా.. లేదంటే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి…