ట్విట్టర్ మంత్రిగా మారిపోయారు :కేటీఆర్ పై డీకే అరుణ సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు కప్పి పుచ్చుకోవడానికి…నిర్లక్ష్యాన్ని కేంద్రంపై మోపుతున్నారని… కేటీఆర్ కళ్లు ఉన్నోడు అయితే ఇలాంటి విషం చిమ్మడని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే కుళ్లు మనస్తత్వం కేటీఆర్ ది అని.. భారత్ బయోటెక్ ను వాళ్ళు విజిట్ చేశారా.. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసారా? అని నిలదీశారు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. ట్విట్టర్ మంత్రిగా మారిపోయారు… హైటెక్ మంత్రిగా గొప్పలు చెప్పుకుంటున్నాడని.. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసా ? అని ప్రశ్నించారు. పీఎం బయోటెక్ ను సందర్శించడం జీర్ణించుకోలేక పోతున్నారని…పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ కు వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఇచ్చామో తెలియదా ? అని నిలదీశారు. 35 వేల కోట్ల రూపాయలు ఒక్క రోజే ఖర్చు చేస్తారా? defacto సీఎం గారు సమాధానం చెప్పాలని చురకలు అంటించారు. ఉమ్మడి జిల్లా జనాభా అంత లేని దేశాలతో భారత దేశాన్ని పోల్చుతున్నాడని.. విదేశీ వ్యాక్సిన్ దేశంలోకి రావడానికి నిబంధనలు ఉండవా ? అని ప్రశ్నించారు. మన దేశ వ్యాక్సిన్ కన్నా ఎక్కువ రేటు ఆ వ్యాక్సిన్ లకు ఉందని.. మీ లాంటి వాళ్లు జేబులు నింపుకోవడానికి తెమ్మంటున్నరా అని నిలదీశారు. మోడీ ఇమేజ్ ను దెబ్బ తీయడానికి ఇలాంటి ప్రయత్నాలు అని…. కుళ్లు రాజకీయాలు సరికాదన్నారు. వ్యాక్సిన్ ఎక్కువ వృధా చేసిన రాష్ట్రం తెలంగాణ అని.. చిల్లర రాజకీయాలు వద్దని హెచ్చరించారు డీకే అరుణ.
Also Read
- Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
- SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?