తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ అంశంతో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్ ప్రభుత్వంలో 5 కళాశాలలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరో ఏడు వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.
Cabinet has resolved to establish 7 medical colleges at Mahbubabad, Sangareddy, Jagtyal, Nagar Kurnool, Wanaparthy, Kothagudem & Manchirial
— KTR (@KTRTRS) May 30, 2021
Prior to formation of Telangana, only 4 Govt medical colleges were built. From 2014 -18, KCR Govt has established 5 & now 7 more to come up