US-Iran War: ఇరాన్లో ఎవరూ ఉండొద్దు.. తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
- ఇరాన్లో ఎవరూ ఉండొద్దు
- తక్షణమే ఖాళీ చేయండి
- పౌరులకు అమెరికా హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మధ్యప్రాచ్యం యుద్ధం ప్రారంభమై 27 రోజులైంది. ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
తాజాగా భద్రతాపరమైన ముప్పు కలిగి ఉన్న నేపథ్యంలో ఇరాక్ను విడిచి వెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం పౌరులను కోరింది. ఈ మేరకు ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఇరాన్కు అనుబంధంగా ఉన్న సాయుధ బృందాలు.. కుర్దిష్ ప్రాంతంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని పేర్కొంది.
Also Read
ఇక ఇరాక్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ దాడుల ముప్పు కొనసాగుతున్నందున అమెరికా పౌరులు వెంటనే ఇరాక్ను విడిచి వెళ్లాలని సూచించింది. బాగ్దాద్లోని రాయబార కార్యాలయాన్ని గానీ, ఎర్బిల్లోని కాన్సులేట్ను గానీ సందర్శించవద్దని హెచ్చరించింది. ఇక విమాన ప్రయాణాలకు అంతరాయం కొనసాగుతున్నందున.. దేశం విడిచి వెళ్లాలనుకునే వారు జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీ వంటి పొరుగు దేశాలకు భూమార్గాల ద్వారా వెళ్లాలని సిఫార్సు చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా లీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన, గ్యాస్ క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం
తాజావార్తలు
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్కు గుడ్ న్యూస్..?
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..