US-Iran War: ఇరాన్లో ఎవరూ ఉండొద్దు.. తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
- ఇరాన్లో ఎవరూ ఉండొద్దు
- తక్షణమే ఖాళీ చేయండి
- పౌరులకు అమెరికా హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మధ్యప్రాచ్యం యుద్ధం ప్రారంభమై 27 రోజులైంది. ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
తాజాగా భద్రతాపరమైన ముప్పు కలిగి ఉన్న నేపథ్యంలో ఇరాక్ను విడిచి వెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం పౌరులను కోరింది. ఈ మేరకు ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఇరాన్కు అనుబంధంగా ఉన్న సాయుధ బృందాలు.. కుర్దిష్ ప్రాంతంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని పేర్కొంది.
Also Read
- Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
- Benjamin Netanyahu: అమెరికా ఒప్పందం చేసుకున్నా తగ్గేదేలే.. ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్..
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
ఇక ఇరాక్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ దాడుల ముప్పు కొనసాగుతున్నందున అమెరికా పౌరులు వెంటనే ఇరాక్ను విడిచి వెళ్లాలని సూచించింది. బాగ్దాద్లోని రాయబార కార్యాలయాన్ని గానీ, ఎర్బిల్లోని కాన్సులేట్ను గానీ సందర్శించవద్దని హెచ్చరించింది. ఇక విమాన ప్రయాణాలకు అంతరాయం కొనసాగుతున్నందున.. దేశం విడిచి వెళ్లాలనుకునే వారు జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీ వంటి పొరుగు దేశాలకు భూమార్గాల ద్వారా వెళ్లాలని సిఫార్సు చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా లీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన, గ్యాస్ క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం
తాజావార్తలు
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?